MLA Raja Singh: ఢిల్లీలో జరిగింది.. తెలంగాణలో కూడా జరగవచ్చు..
- ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం..
- అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం..
- తాన్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: ఢిల్లీలో జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరుగవచ్చని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలిని కోరుకుంటున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఢిల్లీలో రావుస్ IAS స్టడి సర్కిల్ లో సెల్లర్లో మునిగి ముగ్గురు చనిపోయారని తెలిపారు. తెలంగాణకు చెందిన తనీయా ఈ ఘటనలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తనియా కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరుతున్నా.. ఢిల్లీలో మాదిరిగా ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు హైదరాబాద్ లో నడుస్తున్నాయని తెలిపారు. గోషామహల్ లో ఇల్లీగల్ బిల్డింగ్స్ అనేకం ఉన్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి పెట్టాలన్నారు.
గోషామహల్ లో ఇల్లీగల్ గోడౌన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు.. బిల్డింగ్ ల దగ్గర నిలబడి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని కట్టడి చేయడానికి సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Read also: Mallu Bhatti Vikramarka: బోనాల జాతర కు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది..
Also Read
హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగం పై రాజా సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం అన్నారు. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం అని తెలిపారు. తాన్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్ లోనూ ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో ఇల్లీగల్ నిర్మాణాలు నేను చూపిస్తా అన్నారు. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుందన్నారు. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలని కోరారు. ఢిల్లీలో కురిసిన వానలకు పాత రాజేంద్రనగర్లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ఒక్కసారిగా నీటితో నిండిపోయి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందిన ఘటన తెలిసిందే..
Uttam Kumar Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!