Muharram: హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపుకు సర్వం సిద్దం.. ట్రాఫిక్ ఆంక్షలు..
- హైదారబాద్ లో మొహ్రం వేడుకలు..
- బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు..
- పాతబస్తీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muharram: మొహర్రం ఊరేగింపుకు హైదరాబాద్ సిద్దమైంది. పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొహర్రం సంతాప దినంలో భాగంగా అంబారీపై బయలుదేరిన డబీర్పురాలోని బీబీ-కా-ఆలం నుంచి బీబీ-కా-ఆలం ఊరేగింపు చార్మినార్ మీదుగా సాగనుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లిం సోదరులు… కత్తులు, బ్లేడ్లతో శరీరాలను కోసుకుని రక్తం కారుస్తూ రోదించారు. చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఊరేగింపు డబీర్పురాలోని బీబీ-కా-ఆలం నుండి ప్రారంభమై, అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్హౌజ్, పంజేషా, మీరాలం మండి, దారుల్ షిఫా మీదుగా సాగి చాదర్ఘాట్లో ముగుస్తుంది.
Read also: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో తుఫాను బీభత్సం.. 35 మంది మృతి.. 230మందికి గాయాలు
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
మరోవైపు బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో పాతబస్తీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. RTC బస్సులు రంగమహల్, అఫ్జల్గంజ్ నుండి ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రవేశించి .. కాలికబర్, మీరాలం మండి మార్గాల్లో ఊరేగింపు వచ్చే వరకు అనుమతి ఇస్తామని తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతంలో – సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ట్యాంక్బండ్ నుండి కర్బలా మైదాన్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ నుండి కవాడిగూడ, బైబిల్ హౌస్, ఆర్పి రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు. ఆర్పీ రోడ్డు నుంచి కర్బలా మైదాన్ మీదుగా వెళ్లే వాహనాలు కవాడిగూడ ఎక్స్ రోడ్స్, బైబిల్ హౌస్ వద్ద డీబీఆర్ మిల్స్ టీ జంక్షన్ వైపు వెళ్లాలని తెలిపారు. ఎంజీ రోడ్డులోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలాండ్, రాణిగంజ్ మార్గంలో వన్ వే ఉంటుందని, అవసరమైతే రాణిగంజ్ వద్ద ట్రాఫిక్ను మినిస్టర్ రోడ్డులో మళ్లిస్తామని అదనపు సీపీ వివరించారు.
Read also: Tolly wood : నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..
మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, మానవ జాతిలో త్యాగం గొప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వాసం మరియు విశ్వాసం కోసం ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకునేలా ముహర్రం అని వెల్లడించారు. మంచిని, త్యాగాన్ని స్మరించుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థం అన్నారు. ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే ముహర్రం స్ఫూర్తిని అనుకరిద్దాం. త్యాగం, శాంతి, న్యాయం వంటి ఆదర్శాలు మనకెప్పుడూ స్ఫూర్తినిస్తాయని సీఎం అన్నారు. ఈరోజు మొహర్రం సందర్భంగా భాగ్య నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.
OnePlus Nord 4 Price: ‘వన్ప్లస్ నార్డ్ 4’ వచ్చేసింది.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..