Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
- నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు..
- ఇవాళ అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
- ధరణి- హైదరాబాద్ అభివృద్ధి- జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు..
Telangana Assembly 2024: నేడు తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు. ధరణి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30కు మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి హాజరవనున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం..ఎల్బీ స్టేడియంలో భారీ సభలో ప్రసంగించనున్నారు.
Read also: Astrology: ఆగస్టు 02, శుక్రవారం దినఫలాలు
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగాల క్యాలెండర్ను ప్రకటిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అలాగే ప్రజలకు తెల్ల రేషన్కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్లకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కాగా.. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కీలకమైన చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నాలుగో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి జులై 31 అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరగనుంది.
Off The Record : అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో