Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం..
- అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం..
- ముఖ్యఅతిథిగా హాజరైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- 6వేల కోట్లతో ఇలాంటి పథకాన్ని ఎవరూ ప్రారంభించలేదు: డిప్యూటీ సీఎం భట్టి
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక, భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రూప్- 1 పదేళ్లలో ఒక్క సారి కూడా నిర్వహించలేదు.. మేము పరీక్ష పెట్టి ఫలితాలు కూడా ఇచ్చామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పారదర్శకంగా ఫలితాలు వచ్చాయి.. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తున్నాయి.. కాస్త వాయిదా వేయండి అనే వరకు వచ్చింది పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. 6 వేల కోట్ల రూపాయలతో ఎప్పుడూ ఇలాంటి పథకాన్ని ఎవరు ప్రారంభించలేదు.. 50 వేల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాం.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం.. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల మందికి ఆర్ధిక సాయం అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: L2E Empuraan: దిల్ రాజు చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
ఇక, రాజీవ్ యువ వికాసం మంచి ప్రోగ్రాం అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. 5 లక్షల మందికి 4 లక్షల సాయం మంచి పరిణామం.. అద్భుతమైన ఆలోచన.. మా పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ప్రాక్టికల్ గా 4 లక్షలు ఇస్తామంటున్నారు బాగుంది.. స్వయం ఉపాధి వైపు వెళ్లడానికి ఇదో మంచి ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ పార్టీగా సూచన.. మహిళలు, యువతకి దగ్గరవ్వండి.. బీసీలకు ఎమ్మెల్సీలో ప్రాధాన్యత ఇచ్చారు.. వెలుగు రేకలతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అని కూనంనేని చెప్పుకొచ్చారు.
Read Also: Ugadi 2025: రాబోయే ‘విశ్వావసు నామ’ సంవత్సరంలో మీ ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయంటే!
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం.. ఉపాధి కల్పిస్తున్నామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. యువత వీటిని ఉపయోగించుకోవాలి.. ఇదే కాంగ్రెస్ మార్క్ పాలన అని తెలిపారు. మరోవైపు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఇవ్వట్లేదు.. రాజీవ్ యువ వికాసంలో ముస్లిం యువతకు అవకాశాలు కల్పించాలి అని కోరారు. ఇప్పటికే కులగణన చేశారు.. వివరాలు మీ దగ్గర ఉన్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?