Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం..
- అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం..
- ముఖ్యఅతిథిగా హాజరైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- 6వేల కోట్లతో ఇలాంటి పథకాన్ని ఎవరూ ప్రారంభించలేదు: డిప్యూటీ సీఎం భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక, భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రూప్- 1 పదేళ్లలో ఒక్క సారి కూడా నిర్వహించలేదు.. మేము పరీక్ష పెట్టి ఫలితాలు కూడా ఇచ్చామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పారదర్శకంగా ఫలితాలు వచ్చాయి.. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తున్నాయి.. కాస్త వాయిదా వేయండి అనే వరకు వచ్చింది పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. 6 వేల కోట్ల రూపాయలతో ఎప్పుడూ ఇలాంటి పథకాన్ని ఎవరు ప్రారంభించలేదు.. 50 వేల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాం.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం.. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల మందికి ఆర్ధిక సాయం అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: L2E Empuraan: దిల్ రాజు చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
ఇక, రాజీవ్ యువ వికాసం మంచి ప్రోగ్రాం అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. 5 లక్షల మందికి 4 లక్షల సాయం మంచి పరిణామం.. అద్భుతమైన ఆలోచన.. మా పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ప్రాక్టికల్ గా 4 లక్షలు ఇస్తామంటున్నారు బాగుంది.. స్వయం ఉపాధి వైపు వెళ్లడానికి ఇదో మంచి ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ పార్టీగా సూచన.. మహిళలు, యువతకి దగ్గరవ్వండి.. బీసీలకు ఎమ్మెల్సీలో ప్రాధాన్యత ఇచ్చారు.. వెలుగు రేకలతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అని కూనంనేని చెప్పుకొచ్చారు.
Read Also: Ugadi 2025: రాబోయే ‘విశ్వావసు నామ’ సంవత్సరంలో మీ ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయంటే!
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం.. ఉపాధి కల్పిస్తున్నామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. యువత వీటిని ఉపయోగించుకోవాలి.. ఇదే కాంగ్రెస్ మార్క్ పాలన అని తెలిపారు. మరోవైపు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఇవ్వట్లేదు.. రాజీవ్ యువ వికాసంలో ముస్లిం యువతకు అవకాశాలు కల్పించాలి అని కోరారు. ఇప్పటికే కులగణన చేశారు.. వివరాలు మీ దగ్గర ఉన్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!