TG DSC Exams 2024: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. రేపటి నుండి పరీక్షలు..
- రేపటి నుండి వచ్చే నెల 5 వరకు డీఎస్సీ పరీక్షలు..
- రోజు రెండు సెషన్ లలో ఎగ్జామ్..
- పరీక్షలకి దరఖాస్తు చేసుకున్న 2 లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG DSC Exams 2024: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజు రెండు సెషన్ లలో డీఎస్సీ నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 2 లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు పరీక్షలకి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
Read also: Bhatti Vikramarka: నాలుగు నెలలు మాత్రమే.. నైనీ బొగ్గు ఉత్పత్తి పై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఇప్పటికే హాల్ టిక్కెట్లు జారీ కాగా.. తొలిసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఇది రెండో రిక్రూట్మెంట్ పరీక్ష. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ఈసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షకు ముందు ఇలా..
* ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి.
* అభ్యర్థులు మునుపటి రోజు ప్రిపరేషన్ కంటే ఎక్కువగా పరీక్షకు హాజరు కావడానికి అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
* అభ్యర్థులు ముందురోజు రాత్రి బాగా నిద్రపోవాలి.
* పరీక్ష రోజున, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోండి.
* కేటాయించిన స్థలం, కంప్యూటర్ పనితీరును పరిశీలించి కూర్చున్న తర్వాత ఇచ్చిన సూచనల మేరకు ఆన్లైన్ పరీక్ష రాయాలి.
* తెలిసిన సమాధానాలను గుర్తించిన తర్వాత, మిగిలిన ప్రశ్నలకు సమాధానాలను ఎలిమినేషన్ పద్ధతి ద్వారా అంచనా వేయాలి.
* టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ, డీఎస్సీ పరీక్షను 80 మార్కులకు నిర్వహిస్తారు.
* ప్రతి ప్రశ్నకు అరమార్క్ చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి.
DSE Hall Ticket: డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..!
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!