DGP Jitender: తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు.. ఈ నెల 30లోపు వెళ్లిపోవాల్సిందే..!
- తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు..
- 199 మంది దీర్ఘకాల వీసాలపై ఉన్నారు..
- షార్ట్ టర్మ్ వీసాలున్న వారు వెంటనే తిరిగి వెళ్లిపోవాలి..
- ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి పాకి వెళ్లిపోవచ్చు: డీజీపీ జితేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. తెలంగాణలో 230 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నారు.. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు అని తేల్చి చెప్పారు. ఇక, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి.. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: ACB: ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై కొనసాగుతున్న సోదాలు
Also Read
అయితే, లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంత మందికి నోటీసులు ఇచ్చామని డీజీపీ జితేందర్ తెలిపారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29వ తేదీ వరకు టైం ఉంది.. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి అని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీ వరకు అటల్ బోర్డర్ నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. అలాగే, షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో-ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తామన్నారు. మరోవైపు, కర్రెగుట్టలో మావోయిస్టుల ఎరివేతలో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఆపరేషన్ లేదన్నారు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్ట దగ్గర మోహరించలేదని డీజీపీ జితేందర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..