DGP Jitender: తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు.. ఈ నెల 30లోపు వెళ్లిపోవాల్సిందే..!
- తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు..
- 199 మంది దీర్ఘకాల వీసాలపై ఉన్నారు..
- షార్ట్ టర్మ్ వీసాలున్న వారు వెంటనే తిరిగి వెళ్లిపోవాలి..
- ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి పాకి వెళ్లిపోవచ్చు: డీజీపీ జితేందర్
DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. తెలంగాణలో 230 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నారు.. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు అని తేల్చి చెప్పారు. ఇక, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి.. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: ACB: ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై కొనసాగుతున్న సోదాలు
Also Read
అయితే, లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంత మందికి నోటీసులు ఇచ్చామని డీజీపీ జితేందర్ తెలిపారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29వ తేదీ వరకు టైం ఉంది.. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి అని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీ వరకు అటల్ బోర్డర్ నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. అలాగే, షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో-ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తామన్నారు. మరోవైపు, కర్రెగుట్టలో మావోయిస్టుల ఎరివేతలో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఆపరేషన్ లేదన్నారు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్ట దగ్గర మోహరించలేదని డీజీపీ జితేందర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!