TG Congress Protest: నేడు ట్యాంక్బండ్ వద్ద కాంగ్రెస్ నిరసనలు.. కలెక్టరేట్ వరకు పాదయాత్ర..
- రాజ్యసభలో అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు..
- నేడు ట్యాంక్బండ్ వద్ద కాంగ్రెస్ నిరసనలు..
- ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Congress Protest: రాజ్యసభలో అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మరొకసారి దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ‘‘బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్’’ నిర్వహించాలని పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ సర్క్యులర్ జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నిరసన చేపట్టనుంది.
Read also: TG Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 30న కేబినెట్ భేటీ..
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లకడికాపూల్ (పాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం) భారీ ప్రదర్శన చేయనుంది. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మార్చ్ ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించేంత వరకూ మార్చ్ కొనసాగించనున్నారు. ఈ నిరసనలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పెరేషన్ చైర్మన్ లు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నాయకులుపాల్గొంటారు. హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
Read also: YS Jagan: నేడు కడపకు వైఎస్ జగన్.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
కాగా.. డిసెంబర్ 18న రాజ్యసభలో అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్కు ఒక ఫ్యాషన్గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంబేద్కర్ను అమమానించినందుకు అమిత్షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేశారు.
KBR Park: కేబీఆర్ పార్క్కు వెళ్లాలంటే నెలకు రూ.1000 కట్టాల్సిందే..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!