Maheshwar Reddy vs Sridhar Babu: పీవీ కి భారత రత్న.. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
- న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం రాహుల్ గాంధీ వియత్నాం వెళ్ళారట..
- మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో చెబుతున్నా..
- సంతాప సభలో రాజకీయ ప్రసంగం ఎందుకని ప్రశ్నించిన శ్రీధర్ బాబు ..
- మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగించిన స్పీకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy vs Sridhar Babu: పీవీ నరహింహా రావుకి భారత రత్న ఇచ్చింది పీఎం మోడీ అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం నిర్వహించిన అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్డినెన్సు తెస్తే చించి అవమాణించినది రాహుల్ గాంధీ అని అసెంబ్లీలో తెలిపారు. సంతాపంలో ఆయన కీర్తితో పాటు అవమానాలు కూడా చెప్తున్న రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారా..? లేదా..? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భక్తి శివుడి మీద… చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఉంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అని అన్నారు. మన్మోహన్ సింగ్ సేవలు, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజలు మర్చిపోరన్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారన్నారు. స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. డిల్లీలో స్థలాన్ని కేటాయిస్తామని అయన కుటుంబ సభ్యులకు అధికారులు వెళ్లి చెప్పారన్నారు.
Read also: KTR: మన్మోహన్ సింగ్ కే కాదు పీవీ కి కూడా.. అసెంబ్లీలో కేటీఆర్..
Also Read
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పీవీ నరసింహా రావుకి డిల్లీలో స్థలం కేటాయించలేదని, భారత రత్న కూడా ఇవ్వలేదని తెలిపారు. సోనియా కుటుంబం పీవీ మీద కక్ష పెట్టుకున్నారన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి భారత రత్న ఇవ్వకపోతే బీజేపీ ఇచ్చిందన్నారు. మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్డినెన్సు కాపీలను చించి వేసింది రాహుల్ గాంధీ .. మన్మోహన్ సింగ్ ను అవమానించారన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం రాహుల్ గాంధీ వియత్నాం వెళ్ళారట అన్నారు. మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో చెబుతున్నా అన్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పు పట్టారు. సంతాప సభలో రాజకీయ ప్రసంగం ఎందుకు..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రికార్డు నుండి తొలగించాలని అనడంతో.. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుండి స్పీకర్ తొలగించారు.
Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే..
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!