MLA Raja Singh: ఢిల్లీలో జరిగింది.. తెలంగాణలో కూడా జరగవచ్చు..
- ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం..
- అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం..
- తాన్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: ఢిల్లీలో జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరుగవచ్చని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలిని కోరుకుంటున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఢిల్లీలో రావుస్ IAS స్టడి సర్కిల్ లో సెల్లర్లో మునిగి ముగ్గురు చనిపోయారని తెలిపారు. తెలంగాణకు చెందిన తనీయా ఈ ఘటనలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తనియా కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరుతున్నా.. ఢిల్లీలో మాదిరిగా ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు హైదరాబాద్ లో నడుస్తున్నాయని తెలిపారు. గోషామహల్ లో ఇల్లీగల్ బిల్డింగ్స్ అనేకం ఉన్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి పెట్టాలన్నారు.
గోషామహల్ లో ఇల్లీగల్ గోడౌన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు.. బిల్డింగ్ ల దగ్గర నిలబడి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని కట్టడి చేయడానికి సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Read also: Mallu Bhatti Vikramarka: బోనాల జాతర కు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది..
Also Read
హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగం పై రాజా సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం అన్నారు. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం అని తెలిపారు. తాన్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్ లోనూ ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో ఇల్లీగల్ నిర్మాణాలు నేను చూపిస్తా అన్నారు. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుందన్నారు. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలని కోరారు. ఢిల్లీలో కురిసిన వానలకు పాత రాజేంద్రనగర్లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ఒక్కసారిగా నీటితో నిండిపోయి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందిన ఘటన తెలిసిందే..
Uttam Kumar Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!