Hyderabad: మలక్పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
- మలక్పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు
- మొత్తం తొమ్మిది మంది నిందితులుగా గుర్తింపు
- 10 టీమ్లతో పోలీసులు గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని మలక్పేటలో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా చందు నాయక్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే చందు నాయక్ ప్రాణాలు వదిలారు. ఇక చందు నాయక్పై కాల్పులు జరిపి నలుగురు నిందితులు పారిపోయారు. చందును హతమార్చేందుకు రెండు రోజుల నుంచి రాజేశ్ అండ్ టీమ్ రెక్కీ నిర్వహించింది. ప్రస్తుతం రాజేశ్, శివ, మున్నా, భాషాలు పరారీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్
Also Read
- Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
- Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
నలుగురు నిందితులు కూడా మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. చందుపై కాల్పులకు పాల్పడిన వారిలో రాజేశ్ ఉన్నట్లు భార్య, కుమార్తె గుర్తించారు. ఇంటి దగ్గర రాజేశ్ను చూసి చందుకి భార్య సమాచారం అందించింది. నలుగురు నిందితులు మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక హత్య కోసం వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చందు హత్యలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Ukraine: ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా.. కొత్త ప్రధానిగా జెలెన్స్కీ స్నేహితురాలు
రాజేశ్తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రా చారి, యాదిరెడ్డిలు నిందితులుగా ఉన్నట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. హత్యలో నేరుగా పాల్గొనది మాత్రం నలుగురు అని.. వారికి సహకరించింది మరో ఐదుగురు అని పోలీసులు తేల్చారు. తొమ్మిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు కోసం ప్రత్యేకంగా పది టీమ్ల ఏర్పాటు చేశారు. అయితే ఈ హత్యలో గుడిసెల వివాదంతో పాటు వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!