Mahesh Kumar Goud: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్..
- గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ..
- ప్రభుత్వం కి సమాచారం అందిస్తాం- సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తాం..
- మరోవైపు కేటీఆర్ పై ఫైర్ అయ్యారు..
- మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ పీసీసీ చీఫ్ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ రాష్ట్ర వాతావరణం హీటెక్కింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గ్రూప్-1 దుమారం రేపుతుంది. అటు గాంధీభవన్, ఇటు తెలంగాణ భవన్లో నేతలతో అభ్యర్థుల సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి.. గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఓత్తిడి తేవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు గాంధీ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లను తెలుసుకున్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. పాత జీవో 55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 503 పోస్ట్ లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దన్నారు.
Read also: KTR: అండగా ఉంటాం.. గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ..
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
పెంచిన 60 పోస్ట్ ల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది) జీవో 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలని కోరారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలని అన్నారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నే.. డీఎస్సీ.. వైద్యారోగ్యశాఖ లో ఉద్యోగాలు. గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.
Skin Care Tips: మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఇలా చేయండి..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!