Mahesh Kumar Goud: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్..
- గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ..
- ప్రభుత్వం కి సమాచారం అందిస్తాం- సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తాం..
- మరోవైపు కేటీఆర్ పై ఫైర్ అయ్యారు..
- మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ పీసీసీ చీఫ్ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ రాష్ట్ర వాతావరణం హీటెక్కింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గ్రూప్-1 దుమారం రేపుతుంది. అటు గాంధీభవన్, ఇటు తెలంగాణ భవన్లో నేతలతో అభ్యర్థుల సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి.. గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఓత్తిడి తేవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు గాంధీ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లను తెలుసుకున్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. పాత జీవో 55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 503 పోస్ట్ లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దన్నారు.
Read also: KTR: అండగా ఉంటాం.. గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ..
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
పెంచిన 60 పోస్ట్ ల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది) జీవో 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలని కోరారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలని అన్నారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నే.. డీఎస్సీ.. వైద్యారోగ్యశాఖ లో ఉద్యోగాలు. గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.
Skin Care Tips: మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఇలా చేయండి..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!