Mahesh Kumar Goud: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్..
- గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ..
- ప్రభుత్వం కి సమాచారం అందిస్తాం- సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తాం..
- మరోవైపు కేటీఆర్ పై ఫైర్ అయ్యారు..
- మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ పీసీసీ చీఫ్ సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ రాష్ట్ర వాతావరణం హీటెక్కింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గ్రూప్-1 దుమారం రేపుతుంది. అటు గాంధీభవన్, ఇటు తెలంగాణ భవన్లో నేతలతో అభ్యర్థుల సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి.. గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఓత్తిడి తేవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు గాంధీ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లను తెలుసుకున్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. పాత జీవో 55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 503 పోస్ట్ లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దన్నారు.
Read also: KTR: అండగా ఉంటాం.. గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ..
Also Read
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
- Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
పెంచిన 60 పోస్ట్ ల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది) జీవో 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలని కోరారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలని అన్నారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నే.. డీఎస్సీ.. వైద్యారోగ్యశాఖ లో ఉద్యోగాలు. గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.
Skin Care Tips: మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఇలా చేయండి..
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!