గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ నుంచి దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప.
Also Read: MP Horror: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన బంధువులు..
GHMC రిటర్నింగ్ అధికారికి కార్పొరేటర్లు తమ నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్నది. ఇన్నిరోజుల పాటు తమకు స్టాండింగ్ కమిటీలో చోటు లేదని.. ఈసారి తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా మాకు ఓటేస్తారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.