Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News No Fee Hike In Engineering Colleges In Telangana This Year

Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేనట్లే..!

Published Date :June 19, 2025 , 5:43 pm
By Chandra Shekhar Pamena
  • ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపు లేనట్టే..
  • పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..
  • కాలేజీల్లో వసతుల అధ్యయనానికి సబ్ కమిటీ వేయాలని AFRC నిర్ణయం
Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేనట్లే..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Telangana: ఈ విద్యా సంవత్సరం 202-26 ఇంజనీరింగ్ కాలేజ్ ల ఫీజు పెంపు లేనట్టే.. పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల పెంపు విషయంలో కాలేజీలు ఇచ్చిన రిపోర్టులు, కాలేజీల్లో ఉన్న వసతులై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ వేయాలని AFRC నిర్ణయం తీసుకుంది. గతంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును స్టడీ చేయాలని AFRC ప్లాన్ చేస్తుంది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరవాతే ఫీజుల పెంపుపై సహేతుకంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక, అధ్యయనం చేసి ఫీజులు ఖరారు చేసేందుకు టైమ్ పడుతుంది.. ఆగస్టు 14వ తేదీలోపు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యం లో.. పాత ఫీజులతోనే ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

Read Also: Shashi Tharoor: ‘‘బిన్ లాడెన్‌ను మర్చిపోయారా.?’’ ఆసిమ్ మునీర్‌లో లంచ్‌పై విమర్శలు..

Also Read

  • CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌
  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Add as a preferred
source on google

అయితే, ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల నిర్ధారణ హేతుబద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్నా ఫీజులను కొనసాగించాలని పేర్కొనింది. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా ఉన్నాయో అనే దానిపై సర్కార్ అధ్యయనం చేయనుంది. ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపనుంది. అక్కడ ఫీజుల నిర్ధారణ ఎక్స్ పర్ట్ టీమ్స్ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించనున్నాయి. కమిటీల రిపోర్ట్ తరవాత గైడ్ లైన్స్ ను ప్రభుత్వం రూపొందించనుంది. ఫీజుల పెంపు క్రైటీరియా, పద్ధతులను ఫైనల్ చేసి అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీకి సమర్పించే అవకాశం ఉంది. AFRC గైడ్ లైన్స్ లో మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది. AFRC కూడా ఫీల్డ్ విజిట్ చేసే విధంగా నిబంధనలు మార్చనుంది. కొత్త రూల్స్ ప్రకారం ఫీజుల నిర్ధారణ జరిగే వరకు ప్రస్తుతం ఉన్న ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఫీజుల పెంపు లేకపోతే కొన్ని కాలేజీలు కోర్టు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Read Also: UP: నేరస్థుల ఏరివేతలో యోగి సర్కార్ రూటే వేరు.. 8 ఏళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు..

ఇక, ఫీజుల నిర్ధారణ హేతుబద్ధంగా జరగడం లేదని ప్రభుత్వం వాదిస్తుంది. ఆమోదయోగ్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండడం లేదని పేర్కొనింది. కొన్ని కాలేజీల్లో 90 శాతం ఫీజు పెంచారు.. ఖర్చు ఎంత అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.. లాభాపేక్ష లేకుండా విద్యను అందించాలి.. 10 శాతం వరకు లాభం ఒకే అని తెలిపింది. కొన్ని కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ కోసం10 లక్షలు ఖర్చు పెట్టాయి.. యాడ్స్ కు విద్యార్థులకు ఏమీ సంబంధం అని ప్రశ్నించింది. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కొన్ని కాలేజీలు నడుస్తున్నాయని తెలిపింది. కొన్ని కాలేజీల్లో 80 శాతం విద్యార్థులు ప్రభుత్వ ఫీజుల మీదనే చదువుతున్నారు.. AFRC ఫీల్డ్ విజిట్ చేయకుండానే ఫీజుల నిర్ధారణ చేయడం కరెక్ట్ కాదు అని వాదిస్తుంది. వసతులు లేవు, ఫ్యాకల్టీ లేదు.. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు కూడా లేరు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏది పరిగణనలోకి తీసుకోకుండా కాలేజీలు ఇచ్చే ఆడిట్ రిపోర్టుల పైనే ఫీజుల పెంపు ఎలా అంగీకరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025-26 Academic Year
  • Education
  • engineering colleges
  • Fee Regulation Committee
  • No Fee Hike

తాజావార్తలు

  • Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..

  • Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు

  • CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

  • Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..

  • Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions