CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?
- జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్..
- సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం..
- మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారైంది. జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది? విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలేంటి..? తాజాగా పార్టీ మారిన వారికి చోటు దక్కుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- CJP Protest: నేడు హైదరాబాద్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- CM Revanth Reddy : హైదరాబాద్లో భారీ వర్షాలు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రస్తుతం కేబినెట్లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా మరో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్తో సంప్రదింపులు జరిపి మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ, సీఎం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
Read also: Astrology: జులై 03, బుధవారం దినఫలాలు
అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, దానం నాగేందర్లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని స్పష్టమవుతోంది. నిజామాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని వెల్లడించారు. త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే..
Off The Record : సౌమ్యంగా ఉండే ఆ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే ఒక్కసారిగా బూతుపురాణం అందుకున్నారా?
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!