CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?
- జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్..
- సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం..
- మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారైంది. జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది? విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలేంటి..? తాజాగా పార్టీ మారిన వారికి చోటు దక్కుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
ప్రస్తుతం కేబినెట్లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా మరో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్తో సంప్రదింపులు జరిపి మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ, సీఎం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
Read also: Astrology: జులై 03, బుధవారం దినఫలాలు
అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, దానం నాగేందర్లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని స్పష్టమవుతోంది. నిజామాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని వెల్లడించారు. త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే..
Off The Record : సౌమ్యంగా ఉండే ఆ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే ఒక్కసారిగా బూతుపురాణం అందుకున్నారా?
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Trump: ‘జస్ట్ వారికి విరామం ఇచ్చాం’.. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..