Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు!
- కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ
- సినీ హీరో అయినా పరిస్థితులను అర్థం చేసుకోవాలి
- మోహన్ బాబుపై చర్యలు తీసుకుంటాం
వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. పౌరులుగా ప్రతి ఒక్కరు బాధ్యాతాయుతంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు. మీడియా ప్రతినిదిపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ చెప్పారు. నేడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటులు అల్లు అర్జున్ (సంధ్య థియేటర్ తొక్కిసలాట), మంచు మోహన్ బాబు (మీడియా ప్రతినిదిపై దాడి) ఘటనలపై ఆయన స్పందించారు.
‘వ్యక్తిగతంగా మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం. ఆయన సినీ హీరో (అల్లు అర్జున్) కావొచ్చు.. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు. ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు మంచిది కాదు. సినిమాల్లో హీరోలు అయినా బయట మాత్రం పౌరులే. పోలీసు శాఖ చట్టానికి లోబడి పనిచేస్తుంది. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తాం’ అని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
Also Read
- Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
- CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..
Also Read: IND Vs WI: టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!
‘సినీ నటుడు మోహన్బాబుపై కేసు నమోదు చేశాం. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయి. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలి. హీరోలు స్థానిక పరిస్థితులకు అనుకులంగా వ్యవహరించాలి. ప్రజలకు రక్షణ కల్పించడం మా మొదటి ప్రాధాన్యం. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రజల భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
-
Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..
-
Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?