Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సంచలన కామెంట్..
- తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటన..
- ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది..
- కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామన్న మంత్రి సీతక్క..
- దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలు రాజకీయ రగడకు దారితీసింది. తాజాగా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంపై సీతక్క స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని తెలిపారు. కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామని అన్నారు. కుట్ర దారులు వెనక అధికారులు ఉంటే.. ఉద్యోగాలు తీసేస్తాం అని హెచ్చరించారు. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Bhudaan Lands: డిసెంబర్ 6న హాజరు అవ్వండి .. ఎమ్మార్వోతో పాటు నలుగురికి నోటీసులు..
Also Read
- NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
- Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
ఆ.. పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్- సీతక్క ఆగ్రహం..
ఇక దిలావర్పూర్ లో పరిశ్రమ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అని అన్నారు. 2023 లోనే అనుమతి ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్ కంపనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్-బీజేపీ అన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా అనుమతి ఇచ్చింది కేటీఆర్ అన్నారు. నిశీగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు కేటీఆర్.. దిలావర్పూర్ పోదాం రండి అని అన్నారు. చిల్లర రాజకీయాలు ఆవసరమా..? కేటీఆర్ అని మండిపడ్డారు. డ్రామాలు ఆడటం మానుకోవాలని సూచించారు.
Read also: BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
విచ్చల విడిగా గ్రామ సభలు లేకుండా అనుమతి ఎలా ఇచ్చారని కేటీఆర్ పై మండిపడ్డారు. తలసాని వియ్యకుండు మరో భాగస్వామి అన్నారు. మీ తప్పులు కప్పిపుచ్చుకుని మాపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్..నీకు చిత్తశుద్ధి అంటే దిలావర్పూర్కి రా..? అని సవాల్ విసిరారు. కడప వాళ్లకు కంపనీకి ఇచ్చింది కేటీఆర్ అని సీతక్క తెలిపారు. అన్నీ వివరాలు బయట పెడతామన్నారు. కేటీఆర్కు నీతి.. రీతి..జాతీ ఉంటే కంపనీకి అనుమతి ఇచ్చింది నువ్వే అని ఒప్పుకోవాలని అన్నారు. అసెంబ్లీ లో దీనిపై చర్చ చేస్తామన్నారు. స్పీకర్ ముందు చర్చ పెడతామని తెలిపారు. రేపు మీరు ఇచ్చిన అనుమతి వివరాలు బయట పెడతామని సీతక్క తెలిపారు.
CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
తాజావార్తలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?