Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సంచలన కామెంట్..
- తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటన..
- ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది..
- కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామన్న మంత్రి సీతక్క..
- దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్..
Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలు రాజకీయ రగడకు దారితీసింది. తాజాగా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంపై సీతక్క స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని తెలిపారు. కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామని అన్నారు. కుట్ర దారులు వెనక అధికారులు ఉంటే.. ఉద్యోగాలు తీసేస్తాం అని హెచ్చరించారు. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Bhudaan Lands: డిసెంబర్ 6న హాజరు అవ్వండి .. ఎమ్మార్వోతో పాటు నలుగురికి నోటీసులు..
ఆ.. పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్- సీతక్క ఆగ్రహం..
ఇక దిలావర్పూర్ లో పరిశ్రమ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అని అన్నారు. 2023 లోనే అనుమతి ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్ కంపనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్-బీజేపీ అన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా అనుమతి ఇచ్చింది కేటీఆర్ అన్నారు. నిశీగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు కేటీఆర్.. దిలావర్పూర్ పోదాం రండి అని అన్నారు. చిల్లర రాజకీయాలు ఆవసరమా..? కేటీఆర్ అని మండిపడ్డారు. డ్రామాలు ఆడటం మానుకోవాలని సూచించారు.
Read also: BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
విచ్చల విడిగా గ్రామ సభలు లేకుండా అనుమతి ఎలా ఇచ్చారని కేటీఆర్ పై మండిపడ్డారు. తలసాని వియ్యకుండు మరో భాగస్వామి అన్నారు. మీ తప్పులు కప్పిపుచ్చుకుని మాపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్..నీకు చిత్తశుద్ధి అంటే దిలావర్పూర్కి రా..? అని సవాల్ విసిరారు. కడప వాళ్లకు కంపనీకి ఇచ్చింది కేటీఆర్ అని సీతక్క తెలిపారు. అన్నీ వివరాలు బయట పెడతామన్నారు. కేటీఆర్కు నీతి.. రీతి..జాతీ ఉంటే కంపనీకి అనుమతి ఇచ్చింది నువ్వే అని ఒప్పుకోవాలని అన్నారు. అసెంబ్లీ లో దీనిపై చర్చ చేస్తామన్నారు. స్పీకర్ ముందు చర్చ పెడతామని తెలిపారు. రేపు మీరు ఇచ్చిన అనుమతి వివరాలు బయట పెడతామని సీతక్క తెలిపారు.
CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
తాజావార్తలు
-
మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
-
PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ
-
Prakash Raj: “త్వరలో వస్తున్నా.. మీ అందరికీ సమాధానం చెస్తా”.. “శ్రీరాముడి” వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన స్టేట్మెంట్
-
Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్మెంట్!
-
Ajit Agarkar: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ణయించేది ఆయనే!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!