BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..
- ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి- మర్రి రాజశేఖర్ రెడ్డి- మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమావేశం..
- త్వరలో టీడీపీలో జాయిన్ అవుతానన్న తీగల కృష్ణారెడ్డి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLAs: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.
Read also: Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల ఫార్మేట్తో ప్రభుత్వానికి సంబంధం లేదు
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
టీడీపీలో చేరుతాం.. తీగల కృష్ణా రెడ్డి..! మరి మల్లారెడ్డి..?
చంద్రబాబుతో భేటీ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లతో కలిసి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తానని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు హయాంలో సైబరాబాద్, హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందాయని తీగల కృష్ణా రెడ్డి కొనియాడారు. మరోవైపు మీడియాతో మాట్లాడకుండానే మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చకు దారి తీసింది. కాగా.. అయితే చామకూర మల్లారెడ్డి 2014 వరకు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే.. టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో బీఆర్ఎస్లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు చంద్రబాబుతో మల్లారెడ్డి భేటీ హాట్ టాపిక్ గా మారింది.
Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!