Damodar Raja Narasimha: క్యాన్సర్పై అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు..
- ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్..
- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్ను ప్రారంభించిన మంత్రి దామోదర్..
- క్యాన్సర్పై అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు: రాజనర్సింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MNJ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాదులోని లుంబిని పార్క్ నుంచి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్ ను రాష్ట్ర వైద్యారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. నాన్ కమ్యునికబుల్ డిసీజ్లు అన్నింటిలోకెల్లా క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం.. క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయి.. క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Read Also: Dasaradh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ఇక, ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిది అని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పుకొచ్చారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి.. మొత్తం వుమెన్ క్యాన్సర్ బర్డెన్లో 14 శాతం బ్రెస్ట్ కేన్సర్ సంబంధిత కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ఎర్లీ స్టేజ్లో రోగ నిర్దారణ చేయొచ్చు అని వెల్లడించారు. తద్వారా కేన్సర్ను పూర్తిగా నయం అయ్యేలా ట్రీట్మెంట్ అందించొచ్చు.. ప్రతి మహిళా స్క్రీనింగ్ చేయించుకోవడానికి ముందుకు రావాలి.. ప్రభుత్వం ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అందిస్తోంది.. ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తామని మంత్రి దామోదర్ పేర్కొన్నారు.
Read Also: Aravind Kejriwal : ప్రభుత్వ వసతి కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
అలాగే, 6 క్యాన్సర్ రీజినల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నామని హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ చెప్పారు. ఈ సెంటర్లలో డాక్టర్లు, పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తీసుకొస్తాం.. ఈ సెంటర్లు అన్నింటికీ ఎంఎన్జే హాస్పిటల్ హబ్గా ఉంటుంది.. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక్క రోజులోనో, ఒక్క వారంలోనో అయ్యేది కాదు, నెలలు, సంవత్సరాల తరబడి సాగుతుంది.. పేషెంట్లకు ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం.. దాని కోసమే పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం.. డయాబెటీస్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!