NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: లీడ్ బ్యాంకులు లోన్ల విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు రుణమాఫీ పై బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలి.. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దు.. రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్లు. రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతులకు 6000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు.

Read also: Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..

రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల తో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని.. ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా..31 వేల కోట్లు ఈ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్ళామన్నారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నాం తూచా తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. 40 లక్షల బ్యాంకు అకౌంట్లో ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అన్నరు.

Read also: KamalHaasan : ఒకటి థియేటర్లో ఉండగానే మరోటి ముగించిన కమల్ హాసన్

కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టర్ లోను ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం వుండాలన్నారు. ఈరోజు రైతులు ఎలాగా పండుగ చేసుకుంటున్నారు బ్యాంకర్లు కూడా అదే విధంగా పండుగ చేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రాబోతుందన్నారు. ఈ రాష్ట్ర జిఎస్ జిడిపి లో 16.5% వ్యవసాయ రంగం నుంచి వస్తుంది.. రాష్ట్రంలో 45% పైబడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని .. భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని తెలిపారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరుపుకోండి.. విస్తృతంగా ప్రచారం చేయండి అని డిప్యూటీ సీఎం సూచించారు.
NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లు