Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..
- నేడు బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం..
- మూసీ ప్రక్షాళన చేయండి-పేదల ఇళ్లు కూల్చకండి అనే నినాదంతో బీజేపీ మూసీ నిద్ర..
- ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్నారు. ఇవాళ, రేపు అక్కడే బసచేయనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసి పరివాహక ప్రాంతంలో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమాన్ని చేయనుంది. మూసీ ప్రక్షాళన – సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి, మూసి సుందరికరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాలలో నివాసముంటున్న బాధితుల ఇండ్లల్లో వారితో పాటు మమేకమై.. వారి ఇండ్లలోనే నిద్రించి వారికి అండగా బీజేపీ ఉందని భరోసానిచ్చేందుకే బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. త్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు, మూసి పరివాహక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మూసి నిద్ర చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉండునున్నారు. రాత్రి భోజనం, ఉదయం అల్పహారం కూడా అక్కడే చేయనున్నారు బీజేపీ నాయకులు.
Read also: Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
సియోల్ తరహాలో హైదరాబాద్లోని మూసీని పునరుద్ధరిస్తామని తెలంగాణకు చెందిన రేవంత్ సర్కార్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈనెల ఎనిమిదో తేదీన నల్గొండ జిల్లాలోని మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్రకు దిగారు. మూసీ పునరుద్ధరణను అడ్డుకుంటే బుల్ డోజర్లతో తొక్కేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయితే.. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి ప్రాంత పేదలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు, వారికి అండగా నిలుస్తామని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమని చేప్పారు. ఈ క్రమంలోనే.. నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపట్టింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను బీజేపీ నేతలు సందర్శించిన విషయం తెలిసిందే..
Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?