Kunamneni Sambasiva Rao: రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు..
- బీజేపీ- బీఆర్ఎస్ ఇద్దరికీ ఒక్క అజెండా ఉంది అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి..
Kunamneni Sambasiva Rao: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒక్క అజెండా ఉంది.. అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వాల్ల ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారు.. రాబందుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యానించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ పని తీరు ఉందన్నారు.
ప్రజలు ఆశివదించిన ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. హైడ్రా పేద వాళ్ళ జోలికి వెళ్ళడం లేదన్నారు. పేదవారి భుజం మీద తుపాకీ పెట్టీ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ముందు ల్యాండ్ గ్రాబర్స్, పెద్ద వారి నుండి వస్తె.. అప్పుడు పేదవాళ్లకు కొంత భరోసా కలుగుతుందన్నారు. పేద వాళ్లకు రక్షకులుగా కలరింగ్ ఇస్తున్నారు..కానీ పెద్ద వారిని రక్షించాలని ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు పలువురు నాయకులని తెలిపారు. బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్ పడుతుందన్నారు. ప్రభుత్వం లక్ష్యం గురి తప్పుతుందన్నారు.
Read also: కాకరకాయతో శరీరంలోని సగం రోగాలు మాయం!
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
- RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉన్నాం, అదే సమయంలో పేద వాళ్లకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం కు హడావిడి గా చేయాల్సిన అవసరం లేదు.. అలా చేస్తే, నిజమైన వారు తప్పించుకుంటారన్నారు. 100 మంది దొంగలు తప్పించుకున్న, ఒక్క నిర్దోషి శిక్షించబడొద్దని సూచించారు. హైడ్రా మంచికి ఉపయోగిస్తే, మేము సపోర్ట్ చేస్తామని తెలపిఆరు. మూసి నీళ్ళతో పంటలు పండుతాయి.. కానీ అవి తినే పరిస్థితి లేదని నల్గొండ వసూలు చెప్తున్నారన్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, వాతావరణ ప్రియులు అందరితో కలిసి ఒక్క మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పేదవారి ఇళ్లు కూల్చాలని నిర్ణయం తీసుకుంటే, వారికి ప్రత్న్యయం చూపాలన్నారు. భూములు కొనుక్కున్న వారికి ఖాళీ చేయించాలని పరిస్థితి వస్తె.. వారి అప్పటి వరకు ఖర్చు పెట్టిన దాని కంటే మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భూ కబ్జా వారు ఎంత మంది ఉన్నారని గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలంలో అనేక మంది గుడిసెలు వేసుకొని ఉన్నారు.. అలా ఉన్న పేద వారి జోలికి వెళ్లొద్దని తెలిపారు. హైడ్రా వల్ల పేద వారి జోలికి వెళ్లొద్దు, పెద్ద వాడి గుండెలు అదరాలన్నారు. ఒక్క శ్వేత పత్రం విడుదల చెయ్యాలి.. అందులో మాఫియా చేసే వారి ఎంత మంది అన్నారు లెక్క తీయాలన్నారు.
Read also: Kishan Reddy: హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు..
ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వారు ఉంటే వారి లెక్క కూడా తీయాలన్నారు. రూ.20 లక్షల మందికి రుణ మాఫీ ఇవ్వాల్సి ఉంది.. అతి ఉత్సాహంతో పూర్తి స్థాయిలో రైతులకు ఇవ్వలేకపోయారన్నారు. టార్గెట్ పెట్టుకోవడం వల్ల అతి ఉత్సాహం వల్ల అనేక మందికి రుణమాఫీ కాలేదన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది, అవి కూడా ప్రభుత్వం కట్టాలన్నారు. డబ్బులు ఉన్నాయి, లేవు అని జనాలకు చెప్పి రుణమాఫీ చెయ్యాలన్నారు. రుణ భరోసా ఇప్పుడు ఇవ్వలేక పోతున్నాం అంటున్నారు.. అవి బకాయిలు కింద పెట్టీ ,తర్వాత అయిన ఇవ్వాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే.. తర్వాత.. ఎస్సీ లెక్క తీయాలని సూచించారు. ఎంత మంది పిల్లలను బీఆర్ఎస్ వాళ్లు ప్రభుత్వంలో ఉన్నపుడు కొట్టించారన్నారు. పిల్లల కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. అపర్ణ అనే సంస్థ మాఫియా ల తయ్యారైంది..వారి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయబోతున్నాం..అక్కడ ఎర్ర జెండాలు పెట్టబోతున్నామన్నారు. పౌర హక్కుల కోసం నిలబడ్డా వారు ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ,ఇపుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని తెలిపారు. పోలీసులు కనీసం డెడ్ బాడీని పార్టీ ఆఫిస్ లో పెట్టనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Group 1 Exams: రేపే గ్రూప్ 1 మెయిన్స్.. 46 పరీక్షలు కేంద్రాల వద్ద భారీ భద్రత..
తాజావార్తలు
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!