Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- కూకట్ పల్లిలో విషాదం
- నవ దంపతులు ఆత్మహత్య
- మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవ దంపతుల మృతితో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కార్తీక్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మంజుల హౌస్ వైఫ్. NTV తో మృతుడు సోదరుడు మాట్లాడుతూ.. ఇద్దరు సూసైడ్ చేసుకోవడం మమ్మల్ని కలిచి వేసింది.. మేము షాక్ లో ఉన్నామని తెలిపారు. కార్తీక్ మంజుల సూసైడ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. కార్తీక్ ఎంత ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. తనకు అరగంట క్రితం పోలీసు నుండి మా సోదరుడు సూసైడ్ చేసుకున్నాడని కాల్స్ వచ్చినట్లు తెలిపాడు.
Also Read
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
దీంతో ఇంటికి చేరుకుని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం.. బెడ్ రూంలో కార్తిక్ హ్యాంగ్ చేసుకున్నాడు.. మంజుల పాయిజన్ తీసుకుందని తెలిపాడు. కార్తీక్ మంజుల ఇద్దరు మంచిగా ఉండేవారన్నారు. నిన్న సాయంత్రం వారి ఇద్దరితో మాట్లాడాను వారు మంచిగా మాట్లాడారని చెప్పారు. ఎందుకు సుసైడ్ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదన్నారు. కారణం ఏంటో అసలు తెలియదు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
కూకట్పల్లి సీఐ శోభన్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు మాకు సమాచారం అందింది.. ప్రైవేట్ హాస్పిటల్ వారు మాకు కాల్ చేసి ఇద్దరు సూసైడ్ చేసుకున్న కేస్ వచ్చిందని తెలిపారు. దీంతో మా టీమ్ తో ఆసుపత్రికి చేరుకున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు.. కార్తీక్ బెడ్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నాడు మంజుల పాయిజన్ తీసుకున్నట్లు ఉందని తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కారణాలు తెలియరాలేదని అన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్తీక్ ఇంట్లో క్లూస్ టీం తో ఆధారాల సేకరిస్తున్నాం.. సూసైడ్ నోట్ లభించలేదని సీఐ శోభన్ తెలిపారు.
తాజావార్తలు
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
-
Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!