Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- కూకట్ పల్లిలో విషాదం
- నవ దంపతులు ఆత్మహత్య
- మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవ దంపతుల మృతితో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కార్తీక్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మంజుల హౌస్ వైఫ్. NTV తో మృతుడు సోదరుడు మాట్లాడుతూ.. ఇద్దరు సూసైడ్ చేసుకోవడం మమ్మల్ని కలిచి వేసింది.. మేము షాక్ లో ఉన్నామని తెలిపారు. కార్తీక్ మంజుల సూసైడ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. కార్తీక్ ఎంత ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. తనకు అరగంట క్రితం పోలీసు నుండి మా సోదరుడు సూసైడ్ చేసుకున్నాడని కాల్స్ వచ్చినట్లు తెలిపాడు.
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
దీంతో ఇంటికి చేరుకుని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం.. బెడ్ రూంలో కార్తిక్ హ్యాంగ్ చేసుకున్నాడు.. మంజుల పాయిజన్ తీసుకుందని తెలిపాడు. కార్తీక్ మంజుల ఇద్దరు మంచిగా ఉండేవారన్నారు. నిన్న సాయంత్రం వారి ఇద్దరితో మాట్లాడాను వారు మంచిగా మాట్లాడారని చెప్పారు. ఎందుకు సుసైడ్ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదన్నారు. కారణం ఏంటో అసలు తెలియదు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
కూకట్పల్లి సీఐ శోభన్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు మాకు సమాచారం అందింది.. ప్రైవేట్ హాస్పిటల్ వారు మాకు కాల్ చేసి ఇద్దరు సూసైడ్ చేసుకున్న కేస్ వచ్చిందని తెలిపారు. దీంతో మా టీమ్ తో ఆసుపత్రికి చేరుకున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు.. కార్తీక్ బెడ్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నాడు మంజుల పాయిజన్ తీసుకున్నట్లు ఉందని తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కారణాలు తెలియరాలేదని అన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్తీక్ ఇంట్లో క్లూస్ టీం తో ఆధారాల సేకరిస్తున్నాం.. సూసైడ్ నోట్ లభించలేదని సీఐ శోభన్ తెలిపారు.
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!