Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- కూకట్ పల్లిలో విషాదం
- నవ దంపతులు ఆత్మహత్య
- మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవ దంపతుల మృతితో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కార్తీక్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మంజుల హౌస్ వైఫ్. NTV తో మృతుడు సోదరుడు మాట్లాడుతూ.. ఇద్దరు సూసైడ్ చేసుకోవడం మమ్మల్ని కలిచి వేసింది.. మేము షాక్ లో ఉన్నామని తెలిపారు. కార్తీక్ మంజుల సూసైడ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. కార్తీక్ ఎంత ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. తనకు అరగంట క్రితం పోలీసు నుండి మా సోదరుడు సూసైడ్ చేసుకున్నాడని కాల్స్ వచ్చినట్లు తెలిపాడు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
దీంతో ఇంటికి చేరుకుని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం.. బెడ్ రూంలో కార్తిక్ హ్యాంగ్ చేసుకున్నాడు.. మంజుల పాయిజన్ తీసుకుందని తెలిపాడు. కార్తీక్ మంజుల ఇద్దరు మంచిగా ఉండేవారన్నారు. నిన్న సాయంత్రం వారి ఇద్దరితో మాట్లాడాను వారు మంచిగా మాట్లాడారని చెప్పారు. ఎందుకు సుసైడ్ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదన్నారు. కారణం ఏంటో అసలు తెలియదు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
కూకట్పల్లి సీఐ శోభన్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు మాకు సమాచారం అందింది.. ప్రైవేట్ హాస్పిటల్ వారు మాకు కాల్ చేసి ఇద్దరు సూసైడ్ చేసుకున్న కేస్ వచ్చిందని తెలిపారు. దీంతో మా టీమ్ తో ఆసుపత్రికి చేరుకున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు.. కార్తీక్ బెడ్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నాడు మంజుల పాయిజన్ తీసుకున్నట్లు ఉందని తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కారణాలు తెలియరాలేదని అన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్తీక్ ఇంట్లో క్లూస్ టీం తో ఆధారాల సేకరిస్తున్నాం.. సూసైడ్ నోట్ లభించలేదని సీఐ శోభన్ తెలిపారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!