Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- కూకట్ పల్లిలో విషాదం
- నవ దంపతులు ఆత్మహత్య
- మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవ దంపతుల మృతితో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కార్తీక్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మంజుల హౌస్ వైఫ్. NTV తో మృతుడు సోదరుడు మాట్లాడుతూ.. ఇద్దరు సూసైడ్ చేసుకోవడం మమ్మల్ని కలిచి వేసింది.. మేము షాక్ లో ఉన్నామని తెలిపారు. కార్తీక్ మంజుల సూసైడ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. కార్తీక్ ఎంత ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. తనకు అరగంట క్రితం పోలీసు నుండి మా సోదరుడు సూసైడ్ చేసుకున్నాడని కాల్స్ వచ్చినట్లు తెలిపాడు.
Also Read
- GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
దీంతో ఇంటికి చేరుకుని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం.. బెడ్ రూంలో కార్తిక్ హ్యాంగ్ చేసుకున్నాడు.. మంజుల పాయిజన్ తీసుకుందని తెలిపాడు. కార్తీక్ మంజుల ఇద్దరు మంచిగా ఉండేవారన్నారు. నిన్న సాయంత్రం వారి ఇద్దరితో మాట్లాడాను వారు మంచిగా మాట్లాడారని చెప్పారు. ఎందుకు సుసైడ్ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదన్నారు. కారణం ఏంటో అసలు తెలియదు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
కూకట్పల్లి సీఐ శోభన్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు మాకు సమాచారం అందింది.. ప్రైవేట్ హాస్పిటల్ వారు మాకు కాల్ చేసి ఇద్దరు సూసైడ్ చేసుకున్న కేస్ వచ్చిందని తెలిపారు. దీంతో మా టీమ్ తో ఆసుపత్రికి చేరుకున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు.. కార్తీక్ బెడ్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నాడు మంజుల పాయిజన్ తీసుకున్నట్లు ఉందని తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కారణాలు తెలియరాలేదని అన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్తీక్ ఇంట్లో క్లూస్ టీం తో ఆధారాల సేకరిస్తున్నాం.. సూసైడ్ నోట్ లభించలేదని సీఐ శోభన్ తెలిపారు.
తాజావార్తలు
-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
-
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
-
Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
-
Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్గా బాబర్ రీఎంట్రీ..
-
Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!