Jubilee Hills By-Election: ప్రారంభమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్..
- ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్..
- ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్..
- ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది..
- 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు..
- పోలింగ్కు 2,400 మంది పోలీసులతో భద్రతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు. కాగా, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉండగా.. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అయితే, మొత్తం 4,01,365 ఓటర్లు కాగా.. అందులో పురుషులు 2,08,561, ఉండగా మహిళలు 1,92,779, 25 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 139 సెంటర్లలో 407 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో భద్రత కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు 2,060 మంది ఎన్నికల సిబ్బంది ఉండగా.. ఒక బూత్ లో ఒక కంట్రోల్ యూనిట్, నాలుగు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు చేశారు. మొత్తం 2,394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ను సిద్ధం చేశారు.
Read Also: Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్డేట్స్..
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ఇక, ఉప ఎన్నిక కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. పార మిలిటరీ కేంద్ర బలగాలతో పహరా కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ పరిధిలోని రహమత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడా, శ్రీరామ్ నగర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మానిటరింగ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!