Jubilee Hills By-Election: ప్రారంభమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్..
- ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్..
- ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్..
- ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది..
- 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు..
- పోలింగ్కు 2,400 మంది పోలీసులతో భద్రతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు. కాగా, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉండగా.. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అయితే, మొత్తం 4,01,365 ఓటర్లు కాగా.. అందులో పురుషులు 2,08,561, ఉండగా మహిళలు 1,92,779, 25 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 139 సెంటర్లలో 407 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో భద్రత కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు 2,060 మంది ఎన్నికల సిబ్బంది ఉండగా.. ఒక బూత్ లో ఒక కంట్రోల్ యూనిట్, నాలుగు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు చేశారు. మొత్తం 2,394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ను సిద్ధం చేశారు.
Read Also: Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్డేట్స్..
Also Read
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
ఇక, ఉప ఎన్నిక కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. పార మిలిటరీ కేంద్ర బలగాలతో పహరా కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ పరిధిలోని రహమత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడా, శ్రీరామ్ నగర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మానిటరింగ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!