MLC Jeevan Reddy: అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..
- రాహుల్ గాంధీ ఏం చెప్పారు- మనం ఏం చేస్తున్నాం..
- అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ నేతలపై దాడి చేశారు ..
- ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ ముసుగు వేసుకుంటే ఎట్లా..?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నమ్మ్ముకున్న నా కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఇంత అగౌరవం.. అవమానకరంగా భావిస్తున్న అన్నారు. గాంధీభవన్లో జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేఖ రాసినట్లు జీవన్రెడ్డి తెలిపారు. నేను మానసిక వేదనలో ఉన్నాను.. తీవ్ర మానసిక వేదనతో లేఖ రాస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువను పాటించాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు. సంఖ్యాబలంతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చారు. అయినా కూడా తాము పార్టీ ఫిరాయింపులేనని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేక మానసిక ఆవేదనలో ఉన్న అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏ లకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరయింపులకి ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
పోచారం ఇంట్లో మీటింగ్ పెట్టీ… ఫిరాయింపు దారులదే పూర్తి బాధ్యత అంటూ తీర్మానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
పోచారం అధ్యక్షతన ఫిరాయింపు దారులతో సీఎం.. ఇన్చార్జి సమావేశం అవ్వడం… పార్టీలో…ప్రభుత్వంలో వారికే బాధ్యతలు ఇవ్వడం సరికాదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పని చేసిన తాను.. ఇటీవల పార్టీలో చేరిన జగిత్యాల ఎంఎల్ఏ నా అనుచరున్ని కిరాతకంగా చంపించారని భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ ఉన్నా.. ఫిరాయింపుల చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆలోచనలు భిన్నంగా .. కేసీఆర్ అనుసరించినట్టే మనం కూడా ఫిరాయింపులు అని మండిపడ్డారు. తాను నమ్మ్ముకున్న నా కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఇంత అగౌరవం.. అవమానకరంగా భావిస్తున్న అన్నారు. నా భవిష్యత్ కార్యాచరణ పై మీరే మార్గదర్శకం చేయండని తెలిపారు. పార్టీ ఫిరయింపుల కి ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని ఆరోపించారు. పోచారం ఇంట్లో మీటింగ్ పెట్టి.. ఫిరాయింపు దారులే పూర్తి బాధ్యత అంటూ తీర్మానం చేశారన్నారు. రాహుల్ గాంధీ ఏం చెప్పారు.. మనం ఏం చేస్తున్నాం? అని ప్రశ్నించారు. తన అనుచరుణ్ణి చంపిన వ్యక్తి కాంగ్రెస్ వ్యతిరేకి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ నేతలపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ మారి.. కాంగ్రెస్ ముసుగు వేసుకుంటే ఎట్లా..? అని మండిపడ్డారు.
Bandi Sanjay: మూసీ పేరుతో భారీ అవినీతి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్..
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!