Jagga Reddy: బీజేపీ వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారు..
- అమిత్ షా కి రాహుల్ గాంధీ కి తేడా ఉంది..
- పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్ ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: బీజేపీ వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కి రాహుల్ గాంధీ కి తేడా ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ రోజు దేవుడిని మొక్కుతారు కానీ పబ్లిసిటీ చేసుకోరు కానీ.. బీజేపీ వాళ్లు దేవుణ్ణి మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే దేశ ప్రజలకు ఒక ధైర్యం ఒక కవచం అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మోడీ అయినా అమిత్ షా అయినా పదవులు అనుభవిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ కు రాజ్యాంగ నిర్మాణానికి ప్రోస్థహించింది.. ఇచ్చింది జవరహర్ లాల్ నెహ్రూ.. దాన్ని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నది నెహ్రూ ముని మనవడు రాహుల్ గాంధీ అన్నారు.
Read also: KTR Comment: సీఎం రేవంత్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
దేశ ప్రజలు ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే అంబేద్కర్ రాజ్యాంగ ఫలితమే అన్నారు. అది మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేస్తున్నారు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ కుట్ర చేసి రాహుల్ గాంధీనీ గత సంవస్తారం పార్లమెంట్ లో ఉండకుండా కుట్రలు చేశారని తెలిపారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీని పార్లమెంట్ కి రాకుండా దాడి చేసి అడ్డుకుంటున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అయిన అంబేద్కర్ ని అవమానించిన అమీత్ షా క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీ పోరాటం ఆపరని తెలిపారు. రాహుల్ గాంధీ ఏ పిలుపు నిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా ను అవమినిచిన విధానం పై రాహుల్ గాంధీ గళం విప్పారని తెలిపారు.
Read also: Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి
పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్ ను అవమానించేల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయని తెలిపారు. బీసీలుగా చెప్పుకొనే మోదీ అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రంగా కాంగ్రెస్ ఖండిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ బాధ్యత గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరన్న విషయం అమిత్ షా గుర్తించాలని తెలిపారు. అమిత్ షా కి బీజేపీ, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు పబ్లిసిటీ చెయ్యరన్నారు. కానీ బీజేపీ దేవుడిని మొక్కేదే పబ్లిసిటీ చేస్తారన్నారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపుకు సిద్ధంగా ఉంటారన్నారు.
Minister Ramprasad Reddy: భారతదేశంలో నంబర్ వన్గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతాం!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!