Heatwave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
- ఏపీలో 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణొగ్రతలు ..
- ఇవాళ 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
- తెలంగాణలోనూ మండిపోతున్న ఉష్ణోగ్రతలు..
- పలు ప్రాంతాల్లో 41-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave in Telugu States: నిప్పుల కొలిమి.. నిప్పుల కుంపటి.. ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలనుందా.. ఉదయం 9 గంటలకు అలా రోడ్డెక్కండి చాలు.. అర్థాలు తెలుసుకోవడమే కాదు.. స్పెల్లింగ్ కూడా రాసేస్తారు. అట్టుంటది మనతోని అని భాస్కరుడు భగ్గుమంటుంటే.. ఇవేం ఎండల్రా నాయనా అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్లోనే రోహిణి రేంజ్లో సూర్యప్రతాపం కనిపిస్తోంటే.. ఇంకో మూడు నాలుగు రోజులు ఇళ్లల్లోనే ఉండండి అని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెయినీ సీజన్లో వానలు దంచికొడుతున్నాయ్ అంటాం కదా.. ఈ సమ్మర్లో ఎండ దంచికొడుతోంది అనాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఆరు గంటలకే ప్రజెంట్ సర్ అంటూ అటెండెన్స్ ఇస్తున్న సూర్యుడు.. నిమిష నిమిషానికి నిప్పుల కొలిమిలా మారిపోతున్నాడు. 9 గంటలకే మాడు పగిలే రేంజ్లో నిప్పులు కురిపిస్తున్నాడు. పదయ్యే సరికి టెంపరేచర్ సర్రున పెరిగిపోతోంది. ఇంకో అరగంట కాకుండానే.. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు భగభగలుంటున్నాయి.
Read Also: PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం
Also Read
- Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
- Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్ టచ్ అయింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాటలు.. జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి రావొద్దని అధికారులు చెబుతుంటే.. హైరానా పడిపోతున్నారు. మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏపీలో భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతుంటే.. ఇవాళ మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని.. 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డగ్రీల టెంపరేచర్ నమోదయింది. రాబోయే రెండు, మూడు రోజులు.. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 37 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున్న జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
-
PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!