Missing Case: హైదరాబాద్ లో అదృశ్యమైన బాలికలు ఏపీ సూర్యలంక బీచ్ లో ప్రత్యక్షం..
- కూకట్ పల్లిలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన సుఖాంతం..
- ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Case: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన సుఖాంతం అయ్యింది. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ దుర్గ, హారిక కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ శ్రీ చైతన్య కళాశాలలో 8వ తరగతి చదువుకుంటున్నారు. కళాశాలకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి ఇంటి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: Mallu Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్య లంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తోటి సహ విద్యార్థినులు ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. విద్యార్థుల ఆచూకీ ఏపీలో గుర్తించారు. దీంతో ఏపీ పోలీసులకు కూకట్ పల్లి పోలీసులు సమాచారం అందించారు. అదృశ్యమైన లక్ష్మీ దుర్గ, హారికను హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. లక్ష్మీ దుర్గ, హారిక ఏపీకి ఎలా వెళ్లారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. బీచ్ ఎందుకు వెళ్లారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
Read also: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
మరోవైపు జగిత్యాల జిల్లా నాచుపెల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధి అదృశ్యం ఘటన కలకలం రేపింది. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హితీష్ మెకానికల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల నుండి కనబడకపోవడంతో కుమారుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోయినందున మనస్థాపానికి గురై తన అక్కకు తల్లిదండ్రులకు ఫోన్లో జాగ్రత్తలు అని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. హితీస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?