Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ..
- చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు మేము చేయదలుచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్ధత మాదన్నారు. సింగరేణి కాపాడుదాం అని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆర్టీసీ దివాలా తీసి ఉందని తెలిపారు. అలాంటి ఆర్టీసీని మహాలక్ష్మి పేరుతో బతికించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సింగరేణి ని విస్తరించాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. ఆర్టీసీకి నెలకు 400 కోట్లు ఇచ్చి ఆ సంస్థను బతికిస్తున్నామన్నారు. సింగరేణిలో శ్రమదోపిడి జరగకూడదన్నారు.
Read also: Banana Face Mask: అరటి పండుతో ఇలా ట్రై చేయండి..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
కార్మికులకు కనీస వేతనం చెల్లించాల్సిందే అని తెలిపారు. గుండు సూదిని కూడా ఉత్పత్తి చేయలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంతో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నాయకుడు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. సింగరేణి కార్మికుల కోసం ఏం చేయడానికైనా సీఎం సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ తరహాలో తాత్కాలికంగా, తూతూ మంత్రంగా పని చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, సంస్థను అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణి సంస్థ , ఆస్తి కార్మికులదేనని అన్నారు. వారిని ఆదుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రమే ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న ఒక్క గని కూడా బయటకు వెళ్లకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు.
CPI Narayana: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!