Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ..
- చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం తమ ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు మేము చేయదలుచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్ధత మాదన్నారు. సింగరేణి కాపాడుదాం అని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆర్టీసీ దివాలా తీసి ఉందని తెలిపారు. అలాంటి ఆర్టీసీని మహాలక్ష్మి పేరుతో బతికించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సింగరేణి ని విస్తరించాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. ఆర్టీసీకి నెలకు 400 కోట్లు ఇచ్చి ఆ సంస్థను బతికిస్తున్నామన్నారు. సింగరేణిలో శ్రమదోపిడి జరగకూడదన్నారు.
Read also: Banana Face Mask: అరటి పండుతో ఇలా ట్రై చేయండి..
Also Read
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
కార్మికులకు కనీస వేతనం చెల్లించాల్సిందే అని తెలిపారు. గుండు సూదిని కూడా ఉత్పత్తి చేయలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంతో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నాయకుడు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. సింగరేణి కార్మికుల కోసం ఏం చేయడానికైనా సీఎం సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ తరహాలో తాత్కాలికంగా, తూతూ మంత్రంగా పని చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, సంస్థను అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణి సంస్థ , ఆస్తి కార్మికులదేనని అన్నారు. వారిని ఆదుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రమే ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న ఒక్క గని కూడా బయటకు వెళ్లకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు.
CPI Narayana: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!