NTV Telugu Site icon

Rythu Runa Mafi: రూ. 2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..

Agust 15th

Agust 15th

Rythu Runa Mafi: రూ. 2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ లేదీ తర్వాత రుణ మాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిని ఉద్దేశించి వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ జరగని అర్హులైన రైతుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపు నేపథ్యంలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ చేయని అర్హులైన రైతులు మిగిలిపోయారు. వీరికి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది. రేషన్ కార్డులు లేని రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులు 6 లక్షల మందికి పైగా ఉన్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ కోవలోని రైతులపై ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది.

Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్‌

కాగా, రూ.2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులకు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు రూ.2 లక్షలకుపైగా సొమ్ము చెల్లిస్తే.. మిగిలిన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేటగిరీలోని రైతులు కూడా ఆగస్టు 15 తర్వాత ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా రూ. 9 వేల కోట్లు మాఫీ చేయాలంటే రూ. 2 లక్షలకు మించిన రుణానికి రూ. 2 లక్షలు. కానీ, పీఎం-కిసాన్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీ అమలు చేస్తున్నందున, రైతుల సంఖ్య మరియు రుణమాఫీ బడ్జెట్ క్రమంగా తగ్గుతోంది. దీంతో నాలుగో విడతలో రూ. 9 వేల కోట్లు కంటే తక్కువ నిధులే ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్‌ రెడ్డి బిజీ షెడ్యూల్‌..