Revanth Reddy Strong Counter: రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
- అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నారు..
- చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Strong Counter: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి.. అంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విగ్రహార్క, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ నివాళి అర్పించారు. అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనని అనుకుంటున్నారని తెలిపారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు..చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి.. అని హెచ్చరించారు.
Read also: Online Betting: ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలి.. రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
నీ అయ్య (కేసీఆర్) విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు… బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చినతమడకకే పరిమితం అన్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు.. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాదన్నారు. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదని మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం అక్కడి నుంచి సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సెక్రటేరియట్ లోపల కాన్వాయ్ దిగి పరిసరాలు పరిశీలించారు. డిసెంబర్ లో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పై ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు. సెక్రటేరియట్ లోపల ఉన్న బాహుబలి ద్వారం మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి నడిచి వెళ్లారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!