Kavitha: రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన గ్రహచారం.. కవిత సంచలన వ్యాఖ్యలు
- రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
- నూతన జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన గ్రహచారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన ఖర్మేందంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరు. మన గ్రహచారం బాగోలేక రేవంత్రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమకారులపైకి గన్ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తోంది… ఆ రోజైనా అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించాలి. రేవంత్రెడ్డి.. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. పక్క రాష్ట్రం ప్రాజెక్ట్లు కడుతుంటే.. ఏం చేస్తున్నారు.’’ అని నిలదీశారు.
‘‘జూన్ 2 రాజీవ్ యువ వికాసం పేరుతో పథకం ప్రారంభిస్తున్నారని తెలిసింది. పథకాలు.. తెలంగాణ యువ వికాసం పేరుతో ఉండాలి కానీ.. రాజీవ్ వికాసం పేరు మీద కాదు. తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి నోటీసులిస్తారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసు ఇస్తారా? కేసీఆర్కు నోటీసు ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతున్నాం.’’ అని కవిత తెలిపారు.
Also Read
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ఇది కూడా చదవండి: Operation Sindoor: భారత్కి వైమానిక నష్టాలు ఉన్నాయి.. పాక్లోకి వెళ్లి దాడులు చేశాం: సీడీఎస్..
శనివారం సాయంత్రం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. బంజారాహిల్స్లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కవిత వెంట భర్త ఉన్నారు. భర్తతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Kalpika: ప్రిజం పబ్లో హీరోయిన్ పై దాడి..
నూతన కార్యాలయంలో కేసీఆర్, కవిత ఫొటోలు ప్రత్యేకంగా పెట్టారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో బీఆర్. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!