Kavitha: రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన గ్రహచారం.. కవిత సంచలన వ్యాఖ్యలు
- రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
- నూతన జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన గ్రహచారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన ఖర్మేందంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరు. మన గ్రహచారం బాగోలేక రేవంత్రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమకారులపైకి గన్ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తోంది… ఆ రోజైనా అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించాలి. రేవంత్రెడ్డి.. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. పక్క రాష్ట్రం ప్రాజెక్ట్లు కడుతుంటే.. ఏం చేస్తున్నారు.’’ అని నిలదీశారు.
‘‘జూన్ 2 రాజీవ్ యువ వికాసం పేరుతో పథకం ప్రారంభిస్తున్నారని తెలిసింది. పథకాలు.. తెలంగాణ యువ వికాసం పేరుతో ఉండాలి కానీ.. రాజీవ్ వికాసం పేరు మీద కాదు. తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి నోటీసులిస్తారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసు ఇస్తారా? కేసీఆర్కు నోటీసు ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతున్నాం.’’ అని కవిత తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ఇది కూడా చదవండి: Operation Sindoor: భారత్కి వైమానిక నష్టాలు ఉన్నాయి.. పాక్లోకి వెళ్లి దాడులు చేశాం: సీడీఎస్..
శనివారం సాయంత్రం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. బంజారాహిల్స్లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కవిత వెంట భర్త ఉన్నారు. భర్తతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Kalpika: ప్రిజం పబ్లో హీరోయిన్ పై దాడి..
నూతన కార్యాలయంలో కేసీఆర్, కవిత ఫొటోలు ప్రత్యేకంగా పెట్టారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో బీఆర్. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!