Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Brs Mlas Protest Against Rtc Bus Fare Hike In Telangana

BRS in Bus Protest: పెరిగిన టికెట్ ధరలు.. బస్సెక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..

Published Date :October 7, 2025 , 9:00 am
By Chandra Shekhar Pamena
  • తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు..
  • బస్సెక్కి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
  • రెవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు..
BRS in Bus Protest: పెరిగిన టికెట్ ధరలు.. బస్సెక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

BRS in Bus Protest: టికెట్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సేక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన బస్సు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల నుంచి డబుల్ ఛార్జీ వాసులు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు.

Read Also: Samantha: అది నా రెండో ఇల్లు.. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది

Also Read

  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. "ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0" ప్రారంభం.!
  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
  • Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!

ఇక, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై పెను భారం మోపిందన్నారు. ఒక్కో టికెట్ మీద రూ. 10 పెంచి నెలకు రూ. 5 నుంచి 600 రూపాయల భారాన్ని మోపింది.. ప్రభుత్వం రాక ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈరోజు అన్ని రకాల ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపుతున్నాడు.. ఇవాళ ఆర్టీసీ బస్ ఛార్జీలు, మొన్న వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అంతకుముందు మద్యం చార్జీలను పెంచాడని ఆరోపించారు. ఈ విధంగా అన్ని ఛార్జీలను పెంచి సామాన్యుల జీవితాన్ని నరకంగా మారేటట్టు చేస్తున్నారు.. వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించి సామాన్యుడిపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటునే, మరోవైపు మగవారి దగ్గర నుంచి బస్సు చార్జీలు పెంచి రెండింటిని సమానం చేశాడు.. సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Congress Meeting: నేడు సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజానీకంపై పెద్ద ఎత్తున బండరాయి వేసినట్టు అయింది అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులను సంప్రదిస్తారు.. అలాంటిది బస్సుల్లో విపరీతమైన ఛార్జీలు పెంచారు.. వాళ్ల జేబులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం.. పూర్తిగా డీజిల్ ఛార్జీలు తగ్గినా కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ ధరలను పెంచడం ఘోరం.. రూ. 100 కోట్ల ఆదాయం వచ్చే కార్గో ను కూడా వేరే కంపెనీకి ఇచ్చి కేవలం రూ. 36 కోట్లకే దిగజార్చారని ఆరోపణలు చేశారు. అదే ఆదాయం ప్రభుత్వం చేపట్టి పేద ప్రజలపై భారం పడకుండా చూసుంటే బాగుండేది అన్నారు. ఇంత పెద్ద మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని కోరారు. వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS in Bus Protest
  • BRS MLAs Protest
  • BRS Slogans
  • Bus Fare Increase Telangana
  • Opposition Protest

తాజావార్తలు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions