MLA Payal Shankar: ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు..
- టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..
- బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపిన ఎమ్మెల్యే శంకర్..
- ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు: పాయల్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Payal Shankar: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు. ఇక, బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్హత లేదని వెల్లడించారు. బీసీలను అవమానించినందుకే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకపోయింది.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదు అని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేక పోయారు అని పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు.
Read Also: Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
ఈ విషయాలన్నీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకుంటే బాగుంటది అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమేనన్నారు. నామినేట్ పదవులు ఈ రాష్ట్రంలో బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు.. నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమందికి మీరు బీసీలకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే, పార్లమెంట్లో ఎందరి మందికి టికెట్లు ఇచ్చారు తెలుసుకోండి ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర రావు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి విమర్శలు సరికాదు.. ముందు మీ ఇల్లు సక్క పెట్టుకోండి తర్వాత ఇతర పార్టీల గురించి విమర్శించండి అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చుకునే సంప్రదాయం ఉన్న పార్టీ.. ముందు బీసీని సీఎం చేయండి.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి అని పాయల్ శంకర్ విమర్శించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..