MLA Payal Shankar: ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు..
- టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..
- బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపిన ఎమ్మెల్యే శంకర్..
- ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు: పాయల్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Payal Shankar: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు. ఇక, బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్హత లేదని వెల్లడించారు. బీసీలను అవమానించినందుకే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకపోయింది.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదు అని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేక పోయారు అని పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు.
Read Also: Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
Also Read
ఈ విషయాలన్నీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకుంటే బాగుంటది అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమేనన్నారు. నామినేట్ పదవులు ఈ రాష్ట్రంలో బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు.. నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమందికి మీరు బీసీలకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే, పార్లమెంట్లో ఎందరి మందికి టికెట్లు ఇచ్చారు తెలుసుకోండి ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర రావు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి విమర్శలు సరికాదు.. ముందు మీ ఇల్లు సక్క పెట్టుకోండి తర్వాత ఇతర పార్టీల గురించి విమర్శించండి అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చుకునే సంప్రదాయం ఉన్న పార్టీ.. ముందు బీసీని సీఎం చేయండి.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి అని పాయల్ శంకర్ విమర్శించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!