Bidar ATM Robbery: హైదరాబాద్లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు
- హైదరాబాద్లో బీదర్ దొంగలు
- పోలీసుల్ని చూసి కాల్పులు
- రాయ్పూర్ వైపు పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బీదర్ పట్టణంలో గురువారం పట్టపగలు ఏటీఎం వాహనంపై దోపిడీకి పాల్పడ్డ దొంగలు హైదరాబాద్కు చేరుకున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్ అఫ్జల్గంజ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి బీదర్ పోలీసులు దొంగలను వెంటాడుతూ వచ్చారు. అయితే అఫ్జల్గంజ్లో బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రోషన్ ట్రావెల్స్లో రెండు టికెట్లు కొనుగోలు చేశారు. బస్సులో కూర్చున్నాక పట్టుకుందామని చూస్తే.. ఇంతలోనే పోలీసులపై 3 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. హైదరాబాద్ నుంచి రాయ్పూర్కు పారిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు.. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైలర్ అదిరింది.. చూశారా?
Also Read
బీదర్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సినిమా తరహాలో గురువారం భారీ దోపిడీ జరిగింది. శివాజీ సర్కిల్ సమీపంలోని నగరం నడిబొడ్డున ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఎటీఎంలో పెట్టడానికి వాహనంలో డబ్బులు తీసికొచ్చారు. ఇంతలో బైక్పై మెరుపు వేగంతో వచ్చిన ఇద్దరు దుండగులు.. సిబ్బంది ముఖంపై కారం పొడి చల్లి వారిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సీఎంసీ సిబ్బంది గిరి, వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందారు. శివ కాశీనాథ్ అనే మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొందరు నిందితులపై రాళ్లు రువ్వారు. తుపాకీతో బెదిరించడంతో స్థానికులు పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం రూ.93 లక్షల నగదు తీసుకుని నిందితులు పారిపోయారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీని పుటేజీలను పరిశీలించి.. నిందితుల కోసం వేట ప్రారంభించారు.
Money Heist kind of roberry during broad day light in Karnataka's Bidar district.
Robbers shot the man who was in Bank Cash Van and loaded the money in their bike.
Seriously what the fuck is happening #Karnataka #MoneyHeist pic.twitter.com/W9uNTvKdYF— ಬಬ್ರುವಾಹನ (@Paarmatma) January 16, 2025
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!