Medicover Hospital: డెడ్ బాడీ కావాలంటే రూ. 4లక్షలు కట్టండి.. ఠాగూర్ సీన్ రిపీట్..
- హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో దారుణం..
- అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి..
- ఇప్పటి వరకు మూడులక్షలకు పైగా డబ్బు కట్టిన కుటుంబీకులు..
- ఇంకా రూ. 4లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తానంటున్న ఆస్పత్రి వర్గాలు..
- ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medicover Hospital: హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెడికోవర్ హాస్పిటల్ లో జరిగిన ఘటన ఠాగూర్ సినిమా సీన్ ను తలపించింది. మెడికోవర్ హాస్పిటల్ కు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగప్రియకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు మూడు లక్షలకు పైగా డబ్బు కట్టారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అంతటితో ఆగలేదు.. జూనియర్ డాక్టర్ అని కనికరం కూడా లేకుండా.. నాగప్రియ మృత దేహంతో బేరసారానికి దిగడం సంచలం సృష్టించింది. ఆమె డెబ్ బాడీ కావాలంటే ఇంకా నాలుగు లక్షలు కట్టాల్సిందే అని డిమాండ్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఇప్పటి వరకు మూడు లక్షలు చెల్లించామని మృతదేహాన్ని అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినా ఆసుపత్రి యాజమాన్యం ససేమిరా అన్నారు. డబ్బు కట్టేంత వరకు మృతదేహాన్ని ఇచ్చేది లేదని కఠినంగా వ్యవహరించడంతో నాగప్రియ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో మొరపెట్టుకున్నారు. దీంతో అరికెపూడి గాంధీ కాల్ చేసిన ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.
Read also: Donald Trump: 20 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ.. 113 ఎలక్టోరల్ సీట్లు సాధించిన కమలా హరీస్
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
మృతురాలు నాగప్రియ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మూడు లక్షల కడితేనే వైద్యం చేస్తానని, లేదంటే వైద్యం ఆపేస్తాను అంటూ ఆసుపత్రి యాజమాన్యం ఫోన్ చేసిందని తెలిపారు. దీంతో ఇవాళ ఉదయాన్నే వచ్చి లక్ష రూపాయలు కట్టిన తర్వాత పేషెంట్ మృతి చెందిందని డాక్టర్స్ చెప్పారని కన్నీరుమున్నీరుగా విలపించారు. డబ్బుల కోసం నాగప్రియకు వైద్యం ఆపేయడం వలనే చనిపోయింది అని బంధువులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టేంత వరకు నాగప్రియ మృతి వార్త చెప్పలేదని ఆందోళన చేపట్టారు. దీంతో మెడికల్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటి వరకు మూడు లక్షలు కట్టించుకుని డబ్బులు కట్టాక చనిపోయిన వార్త చెప్పారని వాపోయారు. నాగప్రియ నిన్న రాత్రే చనిపోయిందని, అయినా ఆ వార్త చెప్పకుండా ఇవాళ ఉదయం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికవర్ హాస్పిటల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చున్నారు. ఇంత జరుగుతున్న ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు లేకపోవడం పై మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన యాజమాన్యం పట్టించేకోని దాఖలాలు లేదని వాపోతున్నారు. మరి దీనిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Metro Google Wallet: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్..
తాజావార్తలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!