Amit Shah: నేడు హైదరాబాద్కు అమిత్ షా రాక.. రాజకీయంగా కాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్ జిల్లా హకీంపేట్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(ఎన్ఐఎస్ఏ)కి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
Also Read: Jobs Scam Case : తేజస్వి యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.16 వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిర్వహించే రైజింగ్ డే పరేడ్లో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకొని, కేరళ వెళ్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్షా సమావేశమయ్యే అవకాశం ఉంది.
Also Read: Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో అమిత్ షా తెలంగాణ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తులు, వరుస అరెస్టులతో రాజకీయంగా వేడి పెరిగింది. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ అగ్రనాయతక్వం టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులు కూడా అధికార బీఆర్ఎస్ పై మాటల దాడి పెంచింది. తరచూ అగ్ర నాయకులు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా రాక ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలు, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై అమిత్ షా.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. రాజకీయ పరిస్థితులపై చర్చించి, ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలను, రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాలను సమీక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!