Hyderabad Crime: కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. ఆకలి తట్టుకోలేక తల్లి మృతి..
- కన్న తల్లి ని రోడ్డు పై వదిలి వెళ్ళిపోయిన కొడుకు..
- కోడుకు కోసం ఎదురుచూసి అనారోగ్యనికి గురై మృతి చెందిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మను నమ్మించి నడిరోడ్డుపై వదిలేశాడు ఓ కొడుకు. తన కొడుకు వస్తాడని.. తీసుకుని వెళతాడని తన కన్నపేగుకోసం రెండు రోజులు ఎదురుచూసింది తల్లికి నిరాశే మిగిలింది. ఆ రెండు రోజులు తిండిలేక ఆకలితో అలమటించింది. స్థానిక సమాచారంతో ఆపస్మారక స్థితిలో ఉన్న శ్యామలను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కన్నకొడుకును చూడాలనే ఆశతోనే ప్రాణాలు వదిలింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్డేట్స్
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
మేడ్చల్ చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న అరవింద్ కన్న తల్లి శ్యామల(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈ నెల 5వ తేదీన అరవింద్ తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి బోయినపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎంఎంఆర్ గార్డెన్ వద్ద ఫుట్ పాత్ పై వదిలేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కానీ రెండు రోజులు గడిచినా తిరిగి రాలేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్న తల్లి అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల సమాచారం మేరకు బోయినపల్లి పోలీసులు ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్ ఐ శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్తో నల్లాలను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్యామల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కొడుకుని చూడాలని శ్యామల కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపడంతో.. పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇంతలోనే ఆమె కన్ను మూసింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కానీ మృతురాలు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ లో దర్యాప్తు చేసిన ఆమె కుమారుడు అరవింద్ ఆచూకీ లభించలేదు. బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. శ్యామల వివరాలు తెలిసిన వారు ఎవరైన తన కొడుకును తీసుకుని రావాలని చివరి చూపైన తల్లిని చూడాలని కోరారు. శ్యామల కుటుంబ సభ్యులు ఎవరైనా వుంటే వాఉ బోయిన్పల్లి పోలీసులను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వెల్లడించారు.
Parliament Sessions: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు! రికార్డు నుంచి తొలగింపు
తాజావార్తలు
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!