Diwali Special Trains: దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల కోసం UTS మొబైల్ యాప్..
- దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..
- 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు..
- అన్రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించే వారి కోసం U.T.S. మొబైల్ యాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకుని అధికారులు 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. అన్రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించే వారికి.. U.T.S. మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది. గత సీజన్లో 626 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా ఈ సీజన్లో 178 సర్వీసులను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించారు. కాగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రాక్సల్, జయపుర, హిస్సార్, గోరఖ్పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చిలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Kaleshwaram: కాళేశ్వరం అవకతవకలపై నేటి నుంచి మళ్లీ విచారణ..
Also Read
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. మరోవైపు మదురై, ఈరోడ్, నాగర్కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వెల్, దాదర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్డ్ కోచ్లు, అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు దానా తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు. రద్దయిన రైళ్ల వివరాలను సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువ భాగం హౌదా, భువనేశ్వర్, ఖరగ్పూర్ (పశ్చిమ బెంగాల్), పూరి మరియు ఇతర ప్రాంతాల నుండి ఉన్నాయి.
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం..
తాజావార్తలు
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!