Kaleshwaram: కాళేశ్వరం అవకతవకలపై నేటి నుంచి మళ్లీ విచారణ..
- కాళేశ్వరం అవకతవకలపై మళ్లీ విచారణ..
- జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పునఃప్రారంభం..
- ఈ నెల 29 వరకు జరిగే ఈ బహిరంగ విచారణకు పలువురు అధికారులు హాజరు..
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనుంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ బహిరంగ విచారణకు పలువురు ఇంజినీర్లు, అధికారులు, రిటైర్డ్ అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ వ్యవహారాలను కళ్లారా చూసిన ఐఏఎస్ అధికారులను కూడా ఈ నెలాఖరున విచారణకు పిలిచారు. ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించిన తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్ సహా పలువురిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మంగళవారం ఉదయం జస్టిస్ ఘోష్ తో గంటపాటు చర్చించారు.
Read also: Goat Milk Benefits: అయ్యా బాబోయ్.. మేక పాల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
తుది నివేదికను వెంటనే సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీలైనంత త్వరగా కమిషన్ కు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను అందజేస్తామని విజిలెన్స్ డీజీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబరు చివరి వారంలో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికావడంతో బ్రేక్ ఇచ్చిన జస్టిస్ ఘోష్.. మళ్లీ ప్రక్రియను కొనసాగించనున్నందున మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏ రోజు ఎవరిని పిలవాలనే దానిపై చర్చించి షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు. గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా ఉన్న బ్యూరోక్రాట్లు ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, వికాస్ రాజ్, అఫిడవిట్ సమర్పించిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మరియు ఇతరులను జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి.
Rajanna Sircilla: ఊపిరి ఉండగానే స్మశానంలో పడేశారు.. చివరకు ఏమైందంటే..
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!