Kaleshwaram: కాళేశ్వరం అవకతవకలపై నేటి నుంచి మళ్లీ విచారణ..
- కాళేశ్వరం అవకతవకలపై మళ్లీ విచారణ..
- జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పునఃప్రారంభం..
- ఈ నెల 29 వరకు జరిగే ఈ బహిరంగ విచారణకు పలువురు అధికారులు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనుంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ బహిరంగ విచారణకు పలువురు ఇంజినీర్లు, అధికారులు, రిటైర్డ్ అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ వ్యవహారాలను కళ్లారా చూసిన ఐఏఎస్ అధికారులను కూడా ఈ నెలాఖరున విచారణకు పిలిచారు. ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించిన తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్ సహా పలువురిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మంగళవారం ఉదయం జస్టిస్ ఘోష్ తో గంటపాటు చర్చించారు.
Read also: Goat Milk Benefits: అయ్యా బాబోయ్.. మేక పాల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
తుది నివేదికను వెంటనే సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీలైనంత త్వరగా కమిషన్ కు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను అందజేస్తామని విజిలెన్స్ డీజీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబరు చివరి వారంలో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికావడంతో బ్రేక్ ఇచ్చిన జస్టిస్ ఘోష్.. మళ్లీ ప్రక్రియను కొనసాగించనున్నందున మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏ రోజు ఎవరిని పిలవాలనే దానిపై చర్చించి షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు. గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా ఉన్న బ్యూరోక్రాట్లు ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, వికాస్ రాజ్, అఫిడవిట్ సమర్పించిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మరియు ఇతరులను జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి.
Rajanna Sircilla: ఊపిరి ఉండగానే స్మశానంలో పడేశారు.. చివరకు ఏమైందంటే..
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!