54th GST Council Meeting: నేడు ఢిల్లీలో 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం.. హాజరుకానున్న భట్టి విక్రమార్క
- నేడు 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం
- తెలంగాణ నుంచి హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం..
54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికపై జీఎస్టీ కౌన్సిల్ ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరుపునుంచి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారు.
Read also: Central Team: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..
Also Read
GST కౌన్సిల్ అంతకుముందు ఈ సంవత్సరం జూన్ 22, 2024 న సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం, పన్ను శ్లాబులను తగ్గించాలన్న డిమాండ్లు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో జరగనున్న జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. GST కౌన్సిల్ వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులు. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు 53 సార్లు సమావేశమైంది. ఇవాళ 54వ సమావేశం ఖరారైంది. ఈ 54వ సమావేశంలో పన్ను రేట్లలో మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను శ్లాబులను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..
53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కౌన్సిల్ సమావేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుమంత్ చౌదరి పన్ను శ్లాబుల తగ్గింపుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే, బీమా పాలసీలపై వస్తు, సేవల పన్నును పూర్తిగా తొలగించాలన్న డిమాండ్లు కూడా పెరిగాయి. బీమా పాలసీని పూర్తిగా ఎత్తివేయడం వల్ల ప్రతి ఒక్కరూ బీమా లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందని, పెరిగిన ప్రీమియం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు మోయలేని భారంగా మారాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 18 శాతంగా ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
CM Revanth Reddy: నేడు సచివాలయంలో వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!