Hyderabad Thief: తస్మాత్ జాగ్రత్త.. మీ తాళంతోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు!
- జగద్గిరిగుట్టలో దొంగతనం
- ఆరోహి అలియాస్ బేబీ అరెస్ట్
- ₹2.21 లక్షల బంగారం, వెండి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ తాళం చెవితోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు తెలుసా? అలాంటి దొంగలు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నారు. తాజాగా ఓ యువతి అలాగే దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Also Read: Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
ఇంటికి తాళం వేసి షూ స్టాండ్లోనో, పక్కన కిటికీలోనో.. చెట్ల పొదల్లోనో తాళం చెవి దాచేస్తున్నారా? ఐతే మీ తాళం చెవితోనే మీ ఇంటిని దోచేస్తారు.. జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మనం చెప్పుకోబోయే ఈ కిలాడీ లేడీ కూడా అదే కేటగిరీ. జగద్గిరిగుట్ట పరిధిలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆ దొంగతనం చేసింది ఓ యువతి. ఆమె పేరు ఆరోహి అలియాస్ బేబీ. స్వస్థలం ఉత్తర ప్రదేశ్. కానీ హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వచ్చింది.
Also Read:Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!
ఆల్విన్కాలనీకి చెందిన వి.చిరంజీవి ప్రైవేట్జాబ్ చేస్తుంటాడు. ఈ నెల18న పిల్లలను స్కూల్లో దిగబెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి… తాళం చెవిని చెప్పుల స్టాండ్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. గంట సేపటికి తిరిగి వచ్చి చూస్తే తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో ఉన్న 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి మాయమైంది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలు జల్లెడ పడ్డారు. దీంతో ఆరోహి అనే యువతి దొంగతనం చేసిందని గుర్తించారు. సనత్నగర్లోని మధునగర్లో ఉంటున్న ఆరోహి.. ఇంటింటికీ తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటుంది. అలా తిరిగే సమయంలో తాళం వేసిన ఇళ్లు రెక్కీ నిర్వహిస్తుంది. ఆ తర్వాత వాళ్లు పెట్టే కీ ద్వారానే చోరీ చేస్తుంది. ఆమెకు లగ్జరీ లైఫ్అంటే ఇష్టం. గోవా, ముంబైతో పాటు దేశంలోని మేజర్ సిటీస్కు వెళ్లి లైఫ్ను నచ్చినట్టు ఎంజాయ్ చేయాలని ఆశ. ఆమె చేస్తున్న పనితో ఎక్కువ డబ్బులు రాకపోవడంతో లైఫ్ను తాను అనుకున్నట్టు మలుచుకోవడానికి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయింది.
తాజావార్తలు
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!