Hyderabad Thief: తస్మాత్ జాగ్రత్త.. మీ తాళంతోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు!
- జగద్గిరిగుట్టలో దొంగతనం
- ఆరోహి అలియాస్ బేబీ అరెస్ట్
- ₹2.21 లక్షల బంగారం, వెండి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ తాళం చెవితోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు తెలుసా? అలాంటి దొంగలు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నారు. తాజాగా ఓ యువతి అలాగే దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Also Read: Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్
Also Read
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ఇంటికి తాళం వేసి షూ స్టాండ్లోనో, పక్కన కిటికీలోనో.. చెట్ల పొదల్లోనో తాళం చెవి దాచేస్తున్నారా? ఐతే మీ తాళం చెవితోనే మీ ఇంటిని దోచేస్తారు.. జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మనం చెప్పుకోబోయే ఈ కిలాడీ లేడీ కూడా అదే కేటగిరీ. జగద్గిరిగుట్ట పరిధిలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆ దొంగతనం చేసింది ఓ యువతి. ఆమె పేరు ఆరోహి అలియాస్ బేబీ. స్వస్థలం ఉత్తర ప్రదేశ్. కానీ హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వచ్చింది.
Also Read:Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!
ఆల్విన్కాలనీకి చెందిన వి.చిరంజీవి ప్రైవేట్జాబ్ చేస్తుంటాడు. ఈ నెల18న పిల్లలను స్కూల్లో దిగబెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి… తాళం చెవిని చెప్పుల స్టాండ్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. గంట సేపటికి తిరిగి వచ్చి చూస్తే తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో ఉన్న 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి మాయమైంది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలు జల్లెడ పడ్డారు. దీంతో ఆరోహి అనే యువతి దొంగతనం చేసిందని గుర్తించారు. సనత్నగర్లోని మధునగర్లో ఉంటున్న ఆరోహి.. ఇంటింటికీ తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటుంది. అలా తిరిగే సమయంలో తాళం వేసిన ఇళ్లు రెక్కీ నిర్వహిస్తుంది. ఆ తర్వాత వాళ్లు పెట్టే కీ ద్వారానే చోరీ చేస్తుంది. ఆమెకు లగ్జరీ లైఫ్అంటే ఇష్టం. గోవా, ముంబైతో పాటు దేశంలోని మేజర్ సిటీస్కు వెళ్లి లైఫ్ను నచ్చినట్టు ఎంజాయ్ చేయాలని ఆశ. ఆమె చేస్తున్న పనితో ఎక్కువ డబ్బులు రాకపోవడంతో లైఫ్ను తాను అనుకున్నట్టు మలుచుకోవడానికి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయింది.
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!