Special Offer Passengers: అయ్.. ఒక్క రూపాయికే హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Offer Passengers: ఒక్కరూపాయికి ఏమొస్తుంది.. ఏమీ రాదు. అసలు రూపాయికి విలువ ఉంటుందా? రూపాయి రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు వేలు, లక్షలు, కోట్లల్లో బతుకుతున్నా కాలంలో మనం జీవిస్తున్నాం. ఏదైనా కొనాలన్నా.. తినాలన్నా చేతిలో వెయి పక్కా ఉండాల్సిందే. బయటకు వెళితే 10 వేలైనా 10 రూపాయితో సమానమే. ఒక్కప్పుడు దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలో ఒక్కరూపాయికే కిలో బియ్యం అని వినే వుంటాం. అప్పట్లో రూపాయి విలువ ఉండేదేమో కానీ.. మారుతున్న కాలానికి రూపాయి అనే విలువలు ఎప్పుడు పోయాయి. ఇప్పుడు అడుక్కుని తినే వాడికి కూడా రూపాయి ధర్మం వేస్తే పైనుంచి కింది వరకు చూసే రోజులు వచ్చాయి. అలాంటిది రూపాయి ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది. తింక్ బిక్ అబ్బా.. అస్సలు తింక్ చేయలేరు. అది కలలో కూడా ఊహించని హఠాత్ పరిణామాలు అని చెప్పుకోవచ్చు. కానీ.. ఇది నిజమే.. రూపాయికే మందు, రూపాయికే కిలో బియ్యం.. రూపాయికే ప్రయాణం. వినడానికి బాగానే ఉన్న ఈ మాటల్లో చివరి మాట నిజం కాబోతోంది. న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ కేవలం ఒక్క రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్ను అందిస్తోంది.
Read also: Telangana Rains: తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఆగస్టు 15 తర్వాత వర్షాలకు ఛాన్స్..!
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ కంపెనీ న్యూ గో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా ప్రకటించారు. అలాగే ఇండోర్ – భోపాల్, ఢిల్లీ – చండీగఢ్, ఢిల్లీ – ఆగ్రా, ఢిల్లీ – జైపూర్, ఆగ్రా – జైపూర్, బెంగుళూరు – తిరుపతి, చెన్నై – తిరుపతి, చెన్నై – పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో తమ సేవలను కొనసాగిస్తారని, అయితే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ సుస్థిరత కోసం ప్రజలను ప్రోత్సహించడానికి మరియు ఎలక్ట్రిక్ బస్సులలో కూడా సుదూర ప్రయాణాలు చేయవచ్చని నిరూపించడానికి చేపట్టారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు చెల్లుబాటు అవుతుంది. https://nuego.in/booking వెబ్సైట్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ ఆఫర్ను పొందేందుకు ఇప్పటికే చాలా మంది బుకింగ్లు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్కు ఈ సేవలు కొనసాగుతున్నాయని దేవేంద్ర చావ్లా వెల్లడించారు. ఈ ఆఫర్ ఆగస్టు 15న దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
Whatsapp Screen Sharing: వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్.. మీ స్క్రీన్ను ఇతరులతో షేర్
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!