Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- హైటెక్ సిటీ, మాదాపూర్, మైండ్స్పేస్లో స్తంభించిన ట్రాఫిక్
- దుర్గం చెరువు బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- రంగంలోకి దిగిన HYDRAA.. అయినా తగ్గని ట్రాఫిక్ కష్టాలు
- జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంపై ప్రజల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hitech City Traffic :హైదరాబాద్ మహానగరాన్ని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వణికించింది. కేవలం గంట సేపు పడిన వానకే నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా కోట్లు కురిపించే ఐటీ హబ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నడిరోడ్డుపైనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెరువులను తలపించిన ఐటీ రోడ్లు
నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఐక్యా సెంటర్, మాదాపూర్ ప్రాంతాలు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఏ చెరువునో, కుంటనో తలపించాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్లోబల్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకునే ఐటీ కారిడార్లోని డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ వర్షం మరోసారి బయటపెట్టింది. వరద నీరు కొండల్లా పేరుకుపోవడంతో, ఐటీ ఉద్యోగులు ఆకలితో, అలసటతో రోడ్లపైనే మూడు గంటలకు పైగా బందీలయ్యారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
కేబుల్ బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరోవైపు, నగరంలోనే అత్యంత కీలకమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వందలాది కార్లు, బైకులు చీమల కంటే దారుణంగా అంగుళం కూడా కదల్లేని స్థితిలో నిలిచిపోయాయి. అక్కడక్కడా కొద్దిమంది కింది స్థాయి పోలీసులు, హైడ్రా (HYDRAA) సిబ్బంది కలిసి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడానికి, ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి చిత్తశుద్ధితో శ్రమించారు. కానీ, వరద ఉధృతి ముందు వారి ప్రయత్నాలు సరిపోలేదు.
అధికారుల సమన్వయ లోపంపై జనం ఆగ్రహం
ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో అసలు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్’ ఉందా లేదా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద అత్యవసర సమయంలో గ్రేటర్ (GHMC) మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థల మధ్య కనీస కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. అధికారుల ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే తాము నడిరోడ్డుపై నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని ఐటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండి, ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు ఇలాంటి సమయంలో ఏసీ గదులకే పరిమితం కావడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!