MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలు..
- ఎంఎంటీఎస్ సేవలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఆఫీస్ టైమ్స్లో ట్రైన్ల సంఖ్య పెంపుపై ఆదేశాలు
- లాస్ట్ మైల్ కనెక్టివిటీపై కీలక సూచనలు
- ప్రయాణికుల కోసం స్టేషన్లలో మెరుగైన సదుపాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ల సంఖ్య పెంచడంతో పాటు క్రమంతప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..
Also Read
- TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
- Shadi Mubarak Scam: 'షాదీ ముబారక్' పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
- SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని సీఎం తెలిపారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతులు మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ వికాస్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హెచ్యూఎంటీఏ ఎండీ జీవన్ బాబు, దక్షిణ మధ్య రైల్వే డీసీఎం చరణ్ నాయక్ పాల్గొన్నారు.
AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..
తాజావార్తలు
-
Spy Films: ‘వార్ 2’ ఫెయిల్యూర్.. స్పై సినిమాలకు కొత్త సవాల్!
-
CM Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
-
POK: ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..’ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
-
Delhi: ఢిల్లీని కమ్మేసిన చీకట్లు.. మధ్యాహ్నమే అర్ధరాత్రిని తలపించిన ఇసుక తుఫాన్!
-
Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!