Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains: రోహిణి కర్త కారణంగా ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతుందని, దీంతో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 31 నుంచి వచ్చే నెల 3 వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో భానుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.
Read also: Astrology : మే 30, మంగళవారం దినఫలాలు
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. దుండిగల్లో 3.8 మి.మీ, మహబూబ్నగర్లో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఉదయం వరంగల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరంగల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే పలు పట్టణాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతోంది. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది. తుపాను తీవ్రతతో పాటు వడగళ్ల వానలు, తుపాను ఉప్పెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ వరకు ఎండలు, వర్షాలు కురుస్తాయని అంచనా. ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఈరోజు పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
Gehlot vs Pilot: అశోక్, సచిన్ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..