Operation Octopus : హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’..16 రాష్ట్రాల్లో వేట.. 139 మంది నేరగాళ్ల అరెస్ట్.!
- ‘ఆపరేషన్ ఆక్టోపస్’తో సైబర్ ముఠాల కట్టడి
- ₹127 కోట్ల డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బహిర్గతం
- బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ సంచలనం
- 16 రాష్ట్రాల్లో సమన్వయ దాడులు, 1930కు ఫిర్యాదు చేయాలన్న సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించేందుకు హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు భారీ ఆపరేషన్ను చేపట్టారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 139 మంది సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. డిజిటల్ అరెస్ట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్న ముఠాలను పోలీసులు మట్టుబెట్టారు. అరెస్టయిన నిందితులు సుమారు 1,000 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సుమారు 127 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త తరహా మోసంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు.
Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ కన్నా దారుణంగా ఉంటుంది’’.. పాక్కు భారత్ వార్నింగ్..
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి తాము ఈడి (ED), సిబిఐ (CBI), ఇన్కమ్ టాక్స్ (IT), లేదా ముంబై, ఢిల్లీ పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుంటున్నారు. “మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది” అని లేదా “మనీ లాండరింగ్ కేసులో మీరు నిందితులు” అని భయపెట్టి, గంటల తరబడి వీడియో కాల్స్లో ఉంచి (డిజిటల్ అరెస్ట్) భారీగా డబ్బులు లాగుతున్నారు. ఈ ఆపరేషన్లో ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లకు అక్రమ లావాదేవీల కోసం ‘మ్యూల్ అకౌంట్స్’ (Mule Accounts) అందించడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల వేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కు పాల్పడిన నేరగాళ్లు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.
హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ వంటి 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వారం రోజుల పాటు అత్యంత రహస్యంగా సాగిన ఈ ‘ఆపరేషన్ ఆక్టోపస్’ సైబర్ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించింది. ప్రజలు ఎవరైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ కన్నా దారుణంగా ఉంటుంది’’.. పాక్కు భారత్ వార్నింగ్..
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!