Operation Octopus : హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’..16 రాష్ట్రాల్లో వేట.. 139 మంది నేరగాళ్ల అరెస్ట్.!
- ‘ఆపరేషన్ ఆక్టోపస్’తో సైబర్ ముఠాల కట్టడి
- ₹127 కోట్ల డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బహిర్గతం
- బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ సంచలనం
- 16 రాష్ట్రాల్లో సమన్వయ దాడులు, 1930కు ఫిర్యాదు చేయాలన్న సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించేందుకు హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు భారీ ఆపరేషన్ను చేపట్టారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 139 మంది సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. డిజిటల్ అరెస్ట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్న ముఠాలను పోలీసులు మట్టుబెట్టారు. అరెస్టయిన నిందితులు సుమారు 1,000 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సుమారు 127 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త తరహా మోసంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు.
Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ కన్నా దారుణంగా ఉంటుంది’’.. పాక్కు భారత్ వార్నింగ్..
Also Read
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి తాము ఈడి (ED), సిబిఐ (CBI), ఇన్కమ్ టాక్స్ (IT), లేదా ముంబై, ఢిల్లీ పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుంటున్నారు. “మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది” అని లేదా “మనీ లాండరింగ్ కేసులో మీరు నిందితులు” అని భయపెట్టి, గంటల తరబడి వీడియో కాల్స్లో ఉంచి (డిజిటల్ అరెస్ట్) భారీగా డబ్బులు లాగుతున్నారు. ఈ ఆపరేషన్లో ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లకు అక్రమ లావాదేవీల కోసం ‘మ్యూల్ అకౌంట్స్’ (Mule Accounts) అందించడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల వేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కు పాల్పడిన నేరగాళ్లు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.
హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ వంటి 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వారం రోజుల పాటు అత్యంత రహస్యంగా సాగిన ఈ ‘ఆపరేషన్ ఆక్టోపస్’ సైబర్ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించింది. ప్రజలు ఎవరైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ కన్నా దారుణంగా ఉంటుంది’’.. పాక్కు భారత్ వార్నింగ్..
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!