Hyderabadi Biryani: అంతరాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ఒకప్పుడు నిజాంల ప్రత్యేక వంటకంగా పరిగణించబడిన ఈ బిరియాని ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. హైదరాబాదీ బిరియాని అనే పేరు కనిపిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ రుచిని చూసేందుకు క్యూ కడుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ వంటకానికి ఉన్న ఆదరణ ఎంతో ప్రత్యేకం. ఈ ప్రత్యేకత అంతరాష్ట్ర దొంగను కూడా పట్టించిందంటే నమ్ముతారా.. అదెలా అంటే..
కర్ణాటకలోని మైసూర్ హలే కేసరేలో సయ్యద్ ఐజాజ్ ఎలియాస్ ఇమ్రాన్ నివాసముంటున్నాడు. హైదరాబాద్ వచ్చి నగరంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తాళం పగులగొట్టి విలువైన నగలు, నగదును దోచుకోవడం వృత్తిగా పెట్టకున్నాడు. అయితే దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆరగించడం అలవాటు. పలు సందర్భాలలో మలక్పేట సోహైల్ హోటల్ నుంచి జొమాటో ద్వారా మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్క బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. అలా చేస్తూ కొంతకాలం గడిపిన ఇమ్రాన్ ఒకరోజు మలక్పేట పరిధిలోని వెంకటాద్రినగర్ కాలనీలో ఇంటికి తాళం వేసి వుండటంతో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్క బిర్యానీ తెప్పించుకుని ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
అయితే దొంగతనం జరిగిన ఇంటి బాధితుడు సయ్యద్ ఇస్తేకా రుద్దీన్ మే 14న చోరీ జరిగిన సంఘటనను మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్ కాల్ డేటాను సేకరించారు. వీటి లావాదేవీలు మొబైల్ నంబర్ ద్వారా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా మలక్ పేట్ క్రైం ఇన్స్పెక్టర్ నానునాయక్ తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్ ఐజాజ్ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
David Flucker: వందేళ్ల వృద్ధుడు.. కానీ ఇంకా పనిచేస్తున్నాడు..
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?