Cruelty husband: అమ్మను నాన్నే చంపాడు.. కన్నతండ్రిపై కూతురు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruelty husband: కష్టాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ తోడుగా ఉండాల్సిన భర్త , ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెండ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కూతుళ్లు వద్దంటున్నా మాట వినకుండా కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఇరవై రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మృతిచెందింది. తల్లి మృతికి తండ్రే కారణమంటూ కూతుళ్లు ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్లోని సూర్యనగర్కు చెందిన తిరునగర్కు చెందిన నవశ్రీ (33)కి సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారానికి చెందిన నరేందర్ (35)తో 15 ఏళ్ల కిందటే వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వీరి కుటుంబంలో గత నెల 18న చిన్న గొడవ జరిగింది. అది కాస్త పెనుగాలిగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నరేంద్ర తన భార్య నవ్యశ్రీపై శానిటైజర్ పోశాడు. ఆ తర్వాత నిప్పు పెట్టాడు. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి ఆమెకి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం కుమార్తెలు ఇరుగుపొరుగు వారి సహాయంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. గత ఇరవై రోజులుగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు ప్రకటించారు.
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
అయితే నవ్యశ్రీ మృతి చెందడంతో ఆమె పెద్ద కూతురు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తండ్రి నరేంద్రపై ఫిర్యాదు చేసింది. తన తల్లి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోలేదని, తండ్రి ఉద్దేశ్యపూర్వకంగా శానిటైజర్ చల్లి నిప్పంటించాడని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నామని తండ్రికి వద్దని ఎంత చెప్పినా వినలేదని శానిటైజర్ను అమ్మపై చల్లి నిప్పుపెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్ పై 302, 201, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Arogya Mahila: రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన.. నేడు ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం..
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?