Cruelty husband: అమ్మను నాన్నే చంపాడు.. కన్నతండ్రిపై కూతురు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruelty husband: కష్టాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ తోడుగా ఉండాల్సిన భర్త , ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెండ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కూతుళ్లు వద్దంటున్నా మాట వినకుండా కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఇరవై రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మృతిచెందింది. తల్లి మృతికి తండ్రే కారణమంటూ కూతుళ్లు ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్లోని సూర్యనగర్కు చెందిన తిరునగర్కు చెందిన నవశ్రీ (33)కి సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారానికి చెందిన నరేందర్ (35)తో 15 ఏళ్ల కిందటే వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వీరి కుటుంబంలో గత నెల 18న చిన్న గొడవ జరిగింది. అది కాస్త పెనుగాలిగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నరేంద్ర తన భార్య నవ్యశ్రీపై శానిటైజర్ పోశాడు. ఆ తర్వాత నిప్పు పెట్టాడు. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి ఆమెకి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం కుమార్తెలు ఇరుగుపొరుగు వారి సహాయంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. గత ఇరవై రోజులుగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు ప్రకటించారు.
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
అయితే నవ్యశ్రీ మృతి చెందడంతో ఆమె పెద్ద కూతురు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తండ్రి నరేంద్రపై ఫిర్యాదు చేసింది. తన తల్లి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోలేదని, తండ్రి ఉద్దేశ్యపూర్వకంగా శానిటైజర్ చల్లి నిప్పంటించాడని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నామని తండ్రికి వద్దని ఎంత చెప్పినా వినలేదని శానిటైజర్ను అమ్మపై చల్లి నిప్పుపెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు నరేందర్ పై 302, 201, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Arogya Mahila: రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన.. నేడు ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం..
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!