Hyderabad: అన్యోన్య దంపతులు.. ఉప్పల్లో ఉప్పు బస్తాలు చోరీ చేసిన భార్య భర్తలు
Hyderabad: టీవీల్లో, పేపర్లలో ఎన్నో రకాల దొంగతనాల గురించి విన్నాం చదివాము. అంతేకాదు తాళం వేసి ఉన్న ఇళ్లలో దోచుకునే వారు కొందరైతే చైన్ స్నాచింగ్ లకు పాల్పడే వారు మరికొందరైతే.. ATMలు, బ్యాంకులు దొంగతనం చేసేవాళ్లు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం ఏదో ఒక చోట రకరకాల దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. దొంగలు చోరీలకు పాల్పడే చోట విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్లో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. ఈ దొంగతనం చూసిన వాళ్లందరికి నవ్వు పక్కా రావాల్సిందే.. ఎందుకంటే వారు దొంగతనం చేసింది బంగారమో, వెండి వస్తువులు కాదండోయ్ ఉప్పును దొంగతనం చేశారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది భార్య భర్తలు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటుచేసుకుంది.
ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి ఓ కిరాణా దుకాణం ముందు ఉప్పు బస్తాలను దొంగిలించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు బస్తాల ఉప్పు దొంగలించారు. ఇద్దరు వచ్చి అర్ధరాత్రి తమ స్కూటీపై ఏడు బస్తాల ఉప్పును సైలెంట్ గా పెట్టుకున్నారు. ఎవరూ చూడకుండా అక్కడి నుంచి పరారయ్యారు. పాపం వాల్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లిద్దరూ చేసే దొంగతనం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నట్లు గమనించలేక పోయారు. అయితే వాళ్లిద్దరు ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్లు అర్థమవుతుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరూ కూడా మాస్క్ ధరించి ఉప్పు దొంగతనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ షాప్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ బయటకు వచ్చింది.
Also Read
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించడగా.. వారిద్దరూ చేసిన దొంగతనం అంతా వెలుగులోకి వచ్చింది. అయినా ఉప్పు దొంగతనం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు మొదలైన విషయం తెలిసిందే.. అయితే గణపతి చేతిలో లడ్డూ ఉండటం ఆనవాయితీ కూడా.. హైదరాబాద్లోని మియాపూర్ పరిధిలోని మదీనగూడలో ఓ వ్యక్తి వినాయకుడి చేతిలోని లడ్డూలను దొంగలించాడు. ఓంకార సేవా సమితి ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణేశుడి చేతిలో 11 కిలోల లడ్డూలను ఉంచారు. గణపతి బప్పా మోరియా.. అదా లడ్డు చోరియా.. అంటూ నినాదాలు చేసిన ఓ దొంగ.. ఆ లడ్డూ వైపు చూశాడు. ఆదా లడ్డూ ఏమోగానీ.. మొత్తం దోచేశాడు. ఈ చోరీ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.
TSRTC : బస్సు ప్రయాణికులుక గుడ్న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!